బస్సు ఫుట్బోర్డ్ పై ప్రయాణం చేసిన ఇద్దరు స్టార్ హీరోయిన్లు.. వైరల్ అవుతున్న వీడియో..
అక్కినేని సమంత తెలుగుతోపాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు పెళ్లితర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది.
అక్కినేని సమంత తెలుగుతోపాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెల్సిందే. ఈ అమ్మడు పెళ్లితర్వాత సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తుంది. ఈ క్రమంలోనే తమిళ్లో ఓ సినిమాను చేయబోతుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమాలో ఆయన ఎవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ఇక ఈ సినిమా మరో హీరోయిన్గా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తున్నారు. సమంత, సేతుపతి, నయన తార వీరు ముగ్గురు తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ లో నటిస్తున్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మొదటి సారి సౌత్లో ఇద్దరు పెద్ద స్టార్ హీరోయిన్స్ నటిస్తున్న సినిమా అవ్వడంతో తెలుగు మరియు తమిళ ఆడియన్స్లో అంచనాలు మరో రేంజ్ లో ఉన్నాయి.ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇటీవల చెన్నైలో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షూటింగ్లో భాగంగా బస్సులో సమంత, నయనతార, విజయ్ సేతుపతి ప్రయాణించాల్సి ఉంటుంది. ఫుట్బోర్డ్పై నిలబడి ప్రయాణిస్తూ వారు మాట్లాడుకుంటారు. ఈ వీడియోలో హీరోయిన్స్ ఇద్దరూ తెల్ల చీరల్లో కనిపిస్తున్నారు. బస్సు మొత్తం ప్రయాణికులతో నిండిపోయి ఉండడంతో వారు ముగ్గురూ ఇలా ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్నట్లు సీను చిత్రీకరించారు. ఇద్దరు హీరోయిన్లు కూడా ఒకే వ్యక్తిని ప్రేమించడం.. అతడు ఇద్దరిలో ఒకరిని మాత్రమే ప్రేమించడం అలా అలా కథ సాగుతుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ను హైదరాబాద్లో నిర్వహించారు.. కరోనా సెండ్ వేవ్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని ఇటీవలే కేరళ షెడ్యూల్ చేస్తున్నారు.
Kaathuvaakula Rendu Kaadhal shoot.
Vignesh Shivan aa nambalamaa? pic.twitter.com/DUtgvgyBwZ
— Selva (@seldicap17) August 23, 2021
మరిన్ని ఇక్కడ చదవండి :