Puri Jagannadh: ఏకంగా ఆరోసారి ఆ హీరోతో పూరి సినిమా.. చిరు కాదన్నాకథతోనేనా..?
టాలీవుడ్ లో పూరిజగన్నాథ్ సినిమాకు ఓ క్రేజ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది.
Puri Jagannadh: టాలీవుడ్ లో పూరిజగన్నాథ్ సినిమాకు ఓ క్రేజ్ ఉంది. ఆయన నుంచి సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంటుంది. పూరి సినిమాల్లో చెప్పే డైలాగ్స్ కుర్రాళ్ళు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. హీరోలను డిఫరెంట్ స్టైల్ లో చూపించడం లో పూరి దిట్ట. పూరి ప్రస్తుతం క్రేజీ హీరో విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు లైగర్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు పూరి. నిజానికి నందమూరి బాలకృష్ణతో పూరీ జగన్నాథ్ సినిమా ఉండాలి. ఈ ఇద్దరు కలిసి పైసా వసూల్ సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆతర్వాత బాలయ్యతో మరో సినిమా చేస్తా అని చెప్పాడు పూరి. ఈ సినిమా రావడానికి చాలా సమయం పట్టేలా ఉంది. అటు బాలయ్య కూడా బోయపాటి సినిమా తర్వాత క్రాక్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని తో సినిమా చేయనున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి తో ఆమధ్య చిరంజీవితో ఓ సినిమా చేయాలనీ భావించాడు పూరి కానీ అనుకోని వల్ల కారణాల వల్ల ఆసినిమా పట్టాలెక్కలేదు. ఆ కథకు ఆటో జానీ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసాడు పూరి.
ఇప్పుడు ఇదే కథను పూరి .. రవితేజకు వినిపించాడట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా మార్చమని రవితేజ చెప్పడంతో, అందుకు పూరి ఓకే అన్నట్టుగా ఫిలిం నగర్ టాక్ . ఇక పూరి- రవితేజ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం పూరి ఈ ప్రాజెక్టు పైనే దృష్టి పెట్టాడని చెబుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :