Dil Raju: ఆదిపురుష్ ట్రోల్స్పై స్పందించిన దిల్ రాజు.. బాహుబలికి కూడా ఇలాగే జరిగిందంటూ..
ఆదిపురుష్ త్రీడీ టీజర్ లాంచ్ గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా టీమ్ హాజరైంది. హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్తో పాటు.. సినిమా నిర్మాతలు కూడా అటెండ్ అయ్యారు.
ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఆదిపురుష్ ట్రోల్స్పై స్పందించారు నిర్మాత దిల్ రాజు. బాహుబలి సినామాలో శివలింగాన్ని ఎత్తితే.. జెండుబామ్ పెట్టి ట్రోల్ చేశారని.. ఇప్పుడు కూడా అలాంటి ట్రోలింగే జరుగుతోందన్నారు. సినిమాను సినిమాలా చూడాలని.. జనవరి 12న ఆదిపురుష్ ప్రభంజనం సృష్టించబోతోందన్నారు దిల్ రాజు. ఆదిపురుష్ త్రీడీ టీజర్ లాంచ్ గురువారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సినిమా టీమ్ హాజరైంది. హీరో ప్రభాస్, డైరెక్టర్ ఓం రౌత్తో పాటు.. సినిమా నిర్మాతలు కూడా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్.. ఫస్ట్ టైం 3డీలో ఆదిపురుష్ టీజర్ను చూడగానే చిన్న పిల్లాడినైపోయానన్నారు. హైదరాబాద్లో బిగ్ స్క్రీన్పై 3డీ టీజర్ను చూశారు ఆయన. రేపటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో 60 థియేటర్లలో ఈ 3డీ టీజర్ను ప్రదర్శించనున్నామని.. ఫ్యాన్స్ కన్నా తనకు ఎవరూ ఎక్కువ కాదన్నారు. ఈ కార్యక్రమానికి అగ్రనిర్మాత దిల్రాజు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆదిపురుష్ సినిమాపై వస్తోన్న ట్రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘ఆదిపురుష్ టీజర్ను నేను కూడా ఫోన్లోనే చూశాను. చాలా అద్భుతంగా అనిపించింది. అప్పుడే ప్రభాస్ కు ఫోన్ చేసి చెప్పాలనుకున్నాను.. ఆ తరువాత ఇంటికెళ్లి టీవీ లో చూసాను. అప్పుడు ఇంకా బాగా అనిపించింది.. ఇప్పుడు బిగ్ స్రీన్ పై 3డి లో చూసాను. ఇది ఇంకా అద్భుతంగా అనిపించింది. చాలామంది ప్రభాస్ ను, సినిమాను ట్రోల్స్ చేస్తున్నారు. దీనిపై నేను ఒకటే చెప్తున్నా.. బాహుబలి సినిమా చూసినప్పుడు ప్రభాస్ శివ లింగంఎత్తితే ఆ ప్లేస్ లో జెండు బామ్ పెట్టి మొదటి రెండు రోజులు ట్రోల్ చేశారు. కానీ, నేను సినిమా చూసిన నైట్ ప్రభాస్ కు ఫోన్ చేసి చెప్పా.. సూపర్ హిట్ ప్రభాస్ అని. ఆదిపురుష్ కూడా అలాంటి సినిమానే. ఫోన్ లలో చూసి, ఎక్కడో చూసి సినిమాను అంచనా వేయలేం. ఇవన్నీ బిగ్ స్క్రీన్స్ సినిమాలు.. థియేటర్ లో అందరితో పాటు చూసినప్పుడే ఆ సినిమా ఏంటి అనేది తెలుస్తోంది’ అని చెప్పుకొచ్చారు దిల్ రాజు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..