Prashanth Neel: టాలీవుడ్ కుర్ర హీరోతో ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా మూవీ ప్లాన్..?
ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతుంది.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయారు.
ప్రశాంత్ నీల్(Prashanth Neel).. ఇప్పుడు ఈ పేరు మారుమ్రోగిపోతుంది.. ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ దర్శకుల లిస్ట్ లో చేరిపోయారు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన ఈ మూవీ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.. రెండు పార్ట్లుగా వచ్చిన కేజీఎఫ్ మొదటి దానికంటే రెండో పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు స్టార్ హీరోలంతా ప్రశాంత్ తో సినిమా చేయడానికి ఉత్సహం చూపిస్తున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సలార్ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 50 శాతంకు పైగా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారని టాక్.
ఇదిలా ఉంటే ప్రశాంత్ ప్రభాస్ సినిమాతర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నాడు. ఇటీవల తారక్ పుట్టిన రోజు సందర్భంగా తారక్ ప్రీ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అయితే ప్రశాంత్ ఈ సినిమాలతోపాటు మరో తెలుగు సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రశాంత్ నీల్ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. ఇటీవలే శ్యామ్ సింగరాయ్ సినిమాతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతం అంటే సుందరానికి, దసర సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతర్వాత ప్రశాంత్ నీల్ తో కలిసి నాని ఓ పాన్ ఇండియా సినిమా చేయనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే నాని మరియు ప్రశాంత్ నీల్ కాంబో గురించి అసలు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు.