Megastar Chiranjeevi: ఓటీటీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్.. కానీ ఆ వార్తలు మాత్రం నిజం కావంటూ తెల్చీ చెప్పిన చిరు..
ఓటీటీలో విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు వెబ్ సిరీస్తో వెంకటేష్ సందడి చేస్తుండగా.. మరోవైపు టాక్ షో హోస్ట్గా అదరగొడుతున్నారు బాలయ్య. అయితే మెగాస్టార్ చిరు సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని గతంలో పలు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి.
ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గాడ్ ఫాదర్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్తో దూసుకుపోతుంది. మెగాస్టార్ చిరంజీవి.. డైరెక్టర్ మోహన్ రాజా కాంబోలో వచ్చిన ఈ సినిమా వసూళ్లు సునామి సృష్టిస్తోంది. విడుదలైన మొదటి రోజే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. మలయాళీ హిట్ లూసీఫర్ రీమేక్ అయినా… ఎక్కడ కూడా మాతృకకు సంబంధం లేకుండా తెలుగు ఆడియన్స్ ఊహించినట్లుగా రూపొందించడంలో మోహన్ రాజా సక్సెస్ అయ్యారు. లేడీ సూపర్ స్టార్ నయనతార, బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించడంతో ఈ సినిమాకు మరింత హైలెట్ అయ్యింది. పొలిటికల్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా హిట్ కావడంతో మెగాస్టార్ చిరు ఇప్పుడు మరింత సంతోషంగా ఉన్నారు. ఇందులో భాగంగా గాడ్ ఫాదర్ సక్సెస్ సెలబ్రెషన్స్ను మీడియా సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. తాను ఓటీటీ ఎంట్రీ ఇవ్వడం పై స్పందించారు.
ఇప్పటికే ఓటీటీలో విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఓవైపు వెబ్ సిరీస్తో వెంకటేష్ సందడి చేస్తుండగా.. మరోవైపు టాక్ షో హోస్ట్గా అదరగొడుతున్నారు బాలయ్య. అయితే మెగాస్టార్ చిరు సైతం ఓటీటీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు అని గతంలో పలు వార్తలు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. లాక్ డౌన్ సమయంలోనే చిరు పలు ఓటీటీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారని.. త్వరలోనే అరంగేట్రం చేయబోతున్నారంటూ టాక్ వినిపించింది. అయితే అవన్ని అవాస్తవం అని కొట్టిపరేశారు మెగాస్టార్. తనకు డిజిటల్ ప్లాట్ ఫాంపైకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని.. మంచి సబ్జెక్ట్ దొరికితే తప్పుకండా చేస్తానని చెప్పారు. అంతేకాకుండా..గతంలో తాను బుల్లితెరపై మీలో ఎవరు కోటీశ్వరుడు షో చేసిన సంగతి కూడా గుర్తుచేశారు.
ఇక ప్రస్తుతం గాడ్ ఫాదర్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిరు.. మరోవైపు తన మిగతా చిత్రాల షూటింగ్స్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మాస్ మాహారాజా రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అలాగే భోళా శంకర్ చిత్రంలోనూ నటిస్తున్నాడు. ఇందులో మిల్కీబ్యూటీ తమన్నా కథానాయిక కాగా.. కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది.