Acharya: మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్.. ఆచార్య సినిమా వాయిదా.. ప్రకటించిన చిత్రయూనిట్..
మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ రోజునే నిరాశ ఎదురయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా
మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ రోజునే నిరాశ ఎదురయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. కరోనా మహామ్మారి మరోసారి సినీ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు.
ఇప్పుడు కోవిడ్ సెగ ఫిబ్రవరి సినిమాల మీద పడింది. మెగాస్టార్ చిరంజీవి.. రామ్ చరణ్ కలిసి నటిస్తోన్న ఆచార్య సినిమా విడుదల వాయిదా వేశారు మేకర్స్. ఈ విషయాన్ని కాసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి కానుకగా ఆచార్య నుంచి వచ్చే స్పెషల్ అప్డేట్ కోసం మెగా అభిమానులు ఆత్రతగా ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పండగ రోజునే ఆచార్య చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి షాకిచ్చింది చిత్రయూనిట్. కొత్త సంవత్సరంలో రామ్చరణ్కి రెండో సినిమా వాయిదా పడింది. గతంలో ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఆగిపోయిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఆచార్య సినిమా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని తెలిపారు మేకర్స్. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు.
The release of #Acharya stands postponed due to the pandemic.
The new release date would be announced soon.
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @MsKajalAggarwal @hegdepooja #ManiSharma #NiranjanReddy @MatineeEnt @KonidelaPro pic.twitter.com/oVjqcvfl9U
— Konidela Pro Company (@KonidelaPro) January 15, 2022
Also Read: Samantha: సమంతకు మరో క్రేజీ ఆఫర్.. సామ్ కోసం రంగంలోకి దిగుతోన్న మాటల మాంత్రికుడు.?
Vijay Devarakonda: తన మద్దతు చిరుకే అంటోన్న విజయ్ దేవరకొండ.. ట్రెండింగ్లో చిరు ట్వీట్..