Jani Master: కావాలని కుట్ర చేస్తున్నారు.. టీవీ9తో జానీ మాస్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు..

|

Sep 22, 2024 | 10:36 AM

16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ ఆత్యాచారం చేశాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కోనడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగీ పోలీసులు. అయితే ఇటీవలే జానీని మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో హజరుపరచగా.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ లో

Jani Master: కావాలని కుట్ర చేస్తున్నారు.. టీవీ9తో జానీ మాస్టర్ భార్య సంచలన వ్యాఖ్యలు..
Jani Master Wife Ayesha
Follow us on

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వ్యవహారం ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతుంది. కొన్నేళ్లుగా జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని.. మతం మార్చుకుని పెళ్లి చేసుకోవాలంటూ వేధిస్తున్నాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే తనపై జానీ మాస్టర్ ఆత్యాచారం చేశాడంటూ సదరు యువతి ఫిర్యాదులో పేర్కోనడంతో అతడిపై పోక్సో కేసు నమోదు చేశారు నార్సింగీ పోలీసులు. అయితే ఇటీవలే జానీని మాస్టర్ ను ఉప్పర్ పల్లి కోర్టులో హజరుపరచగా.. 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ లో ఉంచాలని ఆదేశించింది. దీంతో జానీని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు జానీ మాస్టర్ కేసులో దర్యాప్తు స్పీడప్ చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఇప్పుడు జానీ భార్య అయోషా చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగకుండా చేసేందుకు కుట్ర పన్నుతున్నారని.. తన భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు జానీ మాస్టర్ భార్య అయేషా.

జానీ మాస్టర్‌పై వస్తున్న ఆరోపణలు అన్ని ఫాల్స్ ఎలిగేషన్ అంటున్నారు ఆయన భార్య అయేషా. జానీ మాస్టర్‌ను ఇండస్ట్రీలో ఎదగనియకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొన్న రేవు పార్టీ అన్నారు.. ఇప్పడు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని టీవీ9తో అయేషా ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. “జానీ మాస్టర్ సినీరంగంలో ఎదగకూడదు.. అందుకే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఆమెకు ట్యాలెంట్ ఉందనే ఉద్ధేశ్యంతోనే జానీ ఆమెకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ అవకాశం ఇచ్చాడు. స్టేజ్ పై డ్యాన్సులు చేసుకునే అమ్మాయికి అవకాశం ఇస్తే ఇప్పుడు ఆయనపైనే తప్పుడు ఆరోపణలు చేస్తుంది. ఆమెపై కొన్నేళ్లుగా లైంగిక దాడి జరుగుతుంటే ఇన్నాళ్లు ఆమె ఎందుకు బయటపెట్టలేదు ? 16 ఏళ్లకే రేప్‌ జరిగితే అప్పుడు ఏం చేశారు ?.ఆ అమ్మాయికి చాలా మందితో సంబంధాలున్నాయి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది అయేషా.

ఇదిలా ఉంటే.. జానీ మాస్టర్ వ్యవహారంపై ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఈ స్థాయికి రావడానికి జానీ మాస్టర్ ఎంతో కష్టపడ్డారని.. కానీ అతడి గురించి వచ్చిన ఆరోపణలు చూసి తన ముక్కలు ముక్కలైందన్నారు హీరో మంచు మనోజ్. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్నిస్తుందని తెలిపింది. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని ట్వీట్ చేశారు. ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా పోరాడాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.