Mahesh Babu: మహేష్ బాబు.. త్రివిక్రమ్ మూవీ అప్డేట్.. విలన్గా ఆ బాలీవుడ్ స్టార్..
సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో
సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం సర్కారు వారి పాట. బ్యాంకింగ్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇటీవల మహేష్ మోకాలి సర్జరీ.. ఆ తర్వాత హీరోహీరోయిన్స్ కరోనా భారీన పడడంతో ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. త్వరలోనే తాజా షెడ్యూల్ మొదలు కానుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్ పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ సరసన పూజ హెగ్డే నటించనుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి నటించనున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ పాత్ర కోసం కన్నడ స్టార్ రవిచంద్రన్ ను సంప్రదించారని వార్తలు వచ్చాయి. కానీ అనుహ్యంగా ఇప్పుడు సునీల్ శెట్టిని ఎంపిక చేసుకున్నట్లుగా టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Radhe Shyam: మార్చిలో సందడి చేయనున్న రాధేశ్యామ్.? నెట్టింట వైరల్ అవుతోన్న విడుదల తేదీ..
Dhanush-Aishwaryaa: ఆ ఇద్దరినీ ఒకటి చేసిన సినిమా.. ఐశ్యర్య, ధనుష్ల అందమైన లవ్ స్టోరీ..