Bigg Boss 8 : విష్ణు ప్రియా కోసం పాట పడిన పృథ్వీ.. దెబ్బకు అమ్మడు ఫిదా అయిపొయింది

నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. హౌస్ లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే.. నిన్న జరిగిన టాస్క్ ల్లో ఒకటి సీత క్లాన్ విన్ అయ్యింది. మరో టాస్క్ లో రెండు క్లాన్‌లు ఓడిపోయాయి. ఆ తర్వాత రెండు క్లాన్లకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ గేమ్ పేరు పట్టుకునే ఉండు.. లేదా పగిలిపోతుంది.

Bigg Boss 8 : విష్ణు ప్రియా కోసం పాట పడిన పృథ్వీ.. దెబ్బకు అమ్మడు ఫిదా అయిపొయింది
Bigg Boss 8
Follow us

|

Updated on: Sep 27, 2024 | 7:22 AM

బిగ్ బాస్ హౌస్ లో కొత్త కొత్త టాస్క్‌లు హౌస్ మేట్స్ ను కంగారు పెట్టిస్తున్నాయి. వైల్డ్ కార్డు ఎంట్రీలను ఆపేందుకు హౌస్ లో ఉన్న వారికీ రకరకాల టాస్క్ లు ఇస్తున్నాడు బిగ్ బాస్. టాస్కు లు ఏమో గాని హౌస్ మేట్స్ మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారందరు మణికంఠను టార్గెట్ చేశారని అర్ధమవుతోంది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. హౌస్ లో సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనే టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే.. నిన్న జరిగిన టాస్క్ ల్లో ఒకటి సీత క్లాన్ విన్ అయ్యింది. మరో టాస్క్ లో రెండు క్లాన్‌లు ఓడిపోయాయి. ఆ తర్వాత రెండు క్లాన్లకు ఓ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ గేమ్ పేరు పట్టుకునే ఉండు.. లేదా పగిలిపోతుంది. ఈ గేమ్ లో ఫ్రేమ్ మీద హ్యాండిల్‌ ని చేత్తో పట్టుకోవాలి ఆ హ్యాండిల్ కి ఉన్న బెలూన్‌ను పగలగుండా కాపాడుకోవాలి. ఎవరి బెలూన్ అయితే పగల కుండా ఉంటుందో వారే విజేత అని చెప్పాడు బిగ్ బాస్. అలాగే గెలిచిన టీమ్‌ ప్రైజ్ మనీలో లక్ష రూపాయలు యాడ్ చేయడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు పొందుతుంది అని చెప్పిన బిగ్ బాస్ ఈ గేమ్‌కు మణికంఠను సంచలక్ గా ఉంచాడు.

ఇది కూడా చదవండి :Geetha Govindam: వాయమ్మో..! ఈ చిన్నది గీతగోవిందంలో చేసిందా..! ఎంత మారిపోయింది

ఇక రెండు క్లాన్లనుంచి నబీల్, అలాగే పృథ్వీ ఈ గేమ్ లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ జరుగుతున్నప్పుడు మిగిలిన హౌస్ మేట్స్ ను బయటకు పంపించేశాడు బిగ్ బాస్. దాంతో అక్కడ నబీల్, పృథ్వీ, మణికంఠ మాత్రమే ఉన్నారు. దాంతో బోర్ కొడుతోంది ఓ పాట పాడు అని నబీల్ మణికంఠను అడగ్గా అతను పాడాడు. అయితే బయట నుంచి వింటున్న యష్మి మణికంఠ పాట పాడితే డీమోటివేట్ అవుతారు అంటూ సెటైర్లు వేసింది.

ఇది కూడా చదవండి :Ranam : రణం బ్యూటీ రచ్చ రంబోలా..! ఈ ముద్దుగుమ్మ ఎంతలా మారిపోయింది.!!

ఆ తర్వాత పృథ్వీ అందుకున్నాడు యానిమల్ సినిమాలోని ఎవరెవరో నాకు ఎదురైనా అనే సాంగ్ ను పాడాడు. ఎవరికోసం ఈ పాట అని నబీల్ అడిగితే. విష్ణు కోసం అని చెప్పాడు. ఈ మాట విన్న విష్ణు ప్రియా మొఖం తెగ వెలిగిపోయింది. నబీల్ పృథ్వీ ఇద్దరూ చాలా బాగా ఆడుతూ గేమ్ ను కంటిన్యూ చేశారు. మధ్యలో బిగ్ బా కొన్ని సరదా ప్రశ్నలు అడిగాడు. నబీల్‌ను  నీకు ఇష్టమైన సభ్యులు ఎవరు అని అడగ్గా.. సీత అని చెప్పాడు. ఆతర్వాత పృథ్వీ.. నబీల్‌ను నా తరఫున ఏదైనా అడగాలంటే అడిగేయండి అని చెప్పాడు బిగ్ బాస్. నీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పరా అంటే నేను సింగిల్ అని చెప్పాడు నబీల్. అలాగే సంచలక్ గా ఉన్న మణికంఠను కూడా కొన్ని ప్రశ్నలు అడిగాడు బిగ్ బాస్. నబీల్, పృథ్వీ ఇద్దరిలో ఎవరు గెలుస్తారని అనుకుంటున్నావు.? అని అడగ్గా పృథ్వీ పేరు చెప్పాడు. ఇద్దరిలో ఒకరిని తీసేయాలంటే ఎవరిని తీసేస్తావ్ అని బిగ్ బాస్ అడిగితే నబీల్ పేరు చెప్పాడు మణికంఠ. ఎందుకు అని బిగ్ బాస్ అడిగితే అడిగితే.. అతనికి ఫిజికల్‌గా బాలేదు.. అయినా ఇప్పటికే మూడు టాస్కులు ఆడాడు.. కనుక.. నేను నబీల్‌ను తీసెస్తా అని చెప్పాడు. దానికి బయట ఉన్న విష్ణు ప్రియా.. నీ గుండు పగలగొడతా అని అంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.