Balakrishna: ఇప్పటివరకు వెళ్లని దారిలోకి బాలకృష్ణ.. అధికారిక ప్రకటన వచ్చేసింది..
నందమూరి నటసింహం బాలకృష్ణ మొదటి సారి సరికొత్త రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటివరకు తన కెరీర్ లో చేయని పని ఇప్పుడు చేసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇదే విషయం ఇప్పుడు అధికారికంగా వచ్చేసింది.
ఇప్పటివరకు వెండితెరపై హీరోగా మెప్పించి.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు బాలయ్య. యాక్షన్ చిత్రాలతోనే కాకుండా.. తనదైన కామెడీ టైమింగ్తో తెలుగు ప్రజలను అలరించారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు వీరసింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో బాలయ్య జోడిగా శ్రుతి హాసన్ నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఓ వైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న బాలయ్య.. మరోవైపు ఆహా డిజిటల్ ప్లాట్ ఫాంపై హోస్ట్గా రాణిస్తున్నారు. ఆయన హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 1 భారీ విజయాన్ని అందుకుంది. తనదైన కామెడీ పంచులు.. ప్రాసలతో అతిథులతో ఆడియన్స్ కు కావాల్సిన సమాధానాలను సున్నితంగా రాబడుతున్నారు. తనదైన స్టైల్తో యాంకరింగ్ కు సరికొత్తదనాన్ని తీసుకువచ్చారు.
ఇక ఇటీవల ప్రారంభమైన సీజన్ 2 కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మొదటి ఎపిసోడ్ లో నారా చంద్రబాబు, నారా లోకేష్ వచ్చి సందడి చేయగా… రెండవ ఎపిసోడ్ లో యంగ్ హీరోస్ సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లను ఆటాడుకున్నారు బాలయ్య. ఇక ఇప్పుడు ఎప్పుడు వెళ్లని దారిలోకి అడుగుపెడుతున్నారు బాలకృష్ణ. అటు హీరోగా.. ఇటు రాజకీయంగా.. హోస్ట్ గా అన్ని విధాలుగా సత్తా చాటుతున్న బాలయ్య.. కెరీర్లో మొదటి సారి కమర్షియల్ యాడ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో సాయి ప్రియ కన్స్ట్రక్షన్ గ్రూప్ కోసం తెరకెక్కించే ఓ ప్రకటనలో బాలయ్య తొలిసారి కనిపించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇప్పటివరకు ఎన్నడు యాడ్ చేయని బాలయ్య… ఇప్పుడు తొలిసారి ప్రకటన రంగంలోకి అడుగుపెడుతున్న ఆయనకు శ్రేయాస్ మీడియా కృతజ్ఞతలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసింది.
మొత్తానికి బాలయ్య.. అటు హీరోగానే కాకుండా.. ఇటు టాక్ షో హోస్ట్ గా సత్తా చాటుతున్నారు. ఇక ఇప్పుడు కమర్షియల్ యాడ్ రంగంలోనూ అడుగుపెట్టనుండడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. గోపిచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య.. డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.
This Diwali marks the beginning of our crackling new chapter?
THE #GODOFMASSES IS STEPPING INTO THE WORLD OF ADVERTISING WITH HIS FIRST-EVER BRAND COMMERCIAL?
We’re Proudly Announcing #NBK is the New Brand Ambassador for @GroupSaipriya ?
Ad By @shreyasgroup @BrandeDigital pic.twitter.com/xOreuOsuqQ
— Shreyas Media (@shreyasgroup) October 22, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.