Allu Arjun : అల్లు అర్జున్ నయా మూవీకి పాన్ ఇండియా మెరుగులు.. కథలో మార్పులు చేస్తున్న డైరెక్టర్..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు.
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ ఆర్మీ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మునుపెన్నడూ చేయని వైవిధ్యమైన పాత్రలో బన్నీ నటిస్తున్నాడు. పుష్పాలో బన్నీ ఊర మాస్ లుక్లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పుష్ప రాజ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అలాగే ఇటీవలే విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’ సాంగ్ యూట్యూబ్లో సరికొత్త రికార్డ్స్ను క్రియేట్ చేస్తుంది. మిలియన్ కొద్దీ వ్యూస్తో దూసుకుపోతుంది ఈ పాట. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. అయితే బన్నీతో ఐకాన్ అనే సినిమాను అప్పుడెప్పుడో అనౌన్స్ చేశాడు వేణు శ్రీరామ్. ఈ మూవీకి కనుబడుట లేదు అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించనున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన ఈ మూవీ లేట్ అవుతూ వస్తుంది…. తాజా సమాచారం ప్రకారం పుష్ప సినిమా తర్వాత ఐకాన్ సెట్స్ పైకి వెళ్లనున్నందట. ఇప్పటికే డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా స్టార్ గా మారనున్నాడు. దాంతో ఇప్పుడు ఐకాన్ కథలో చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారట. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దాంతో కొందరు రచయితలు ఐకాన్ స్క్రిప్ట్కు వేణు శ్రీరామ్తో కలిసి పాన్ ఇండియా టచ్ ఇస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా చిత్రీకరణ అక్టోబర్లో మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పుష్ప పార్ట్ 1 -పార్ట్ 2 కు మధ్యలో ఈ సినిమాను విడుదల చేసేలా షూటింగ్ ప్లాన్ చేసుకుంటున్నారట.
మరిన్ని ఇక్కడ చదవండి :