రోజూ గోమూత్రం తాగుతా : అక్షయ్ కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఓ ఆసక్తికర అంశాన్ని వెల్లడించారు. తాను ప్రతిరోజు ఆవు మూత్రం తాగుతానని తెలిపారు. సాహస యాత్రికుడు బేర్గ్రిల్స్తో లైవ్లో మాట్లాడుతూ ఈ విషయాన్ని రివీల్ చేశారు. ‘ఇన్టూ ది వైల్డ్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ, సూపర్స్టార్ రజనీకాంత్ తర్వాత బేర్ గ్రిల్స్తో కలిసి అడవిలో సాహసాలు చేశారు అక్షయ్. ఆ ఎపిసోడ్ నేడు ప్రసారం కానుంది. ఈ సందర్భంగా బేర్గ్రిల్స్తో కలిసి గురువారం లైవ్ చాట్ నిర్వహించారు. అక్షయ్తో పాటు హీరోయిన్లు హ్యుమా ఖురేషి, లారా దత్తా పాల్గొన్నారు. ప్రజంట్ ‘బెల్ బాటమ్’ షూటింగ్ కోసం వీరందరూ స్కాట్లాండ్లో ఉన్నారు.
“మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో భాగంగా ఏనుగు మలంతో చేసిన సూప్ ఎలా తాగారు?” అని హ్యుమా ఖురేషి అక్షయ్ను ప్రశ్నించగా.. “అది నాకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే ఆయుర్వేద వైద్య ప్రక్రియలో భాగంగా, ప్రతిరోజు నేను గోమూత్రం తాగుతాను” అని చెప్పారు.
Also Read :