Actor VK Naresh: నరేష్-రమ్య రఘుపతి ఎపిసోడ్లో ఊహించని ట్విస్ట్.. రూ.10కోట్ల సెటిల్మెంట్
రమ్యపై మరోసారి సంచలన ఆరోపణలు చేసిన నరేష్. పెళ్లైన తర్వాతి నెల నుంచే రమ్య తనను వేధించేదని చెప్పుకొచ్చారు.
నరేష్-రమ్య రఘుపతి ఎపిసోడ్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయ్. రమ్యతో తనకు ప్రాణహాని ఉందంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్. తనను చంపేందుకు తన ఇంటి దగ్గర రెక్కీ చేయించిందంటూ కోర్టులో పిటిషన్ వేశారు నరేష్. కర్నాటక రౌడీ రాకేష్శెట్టితో రెక్కీ చేయించిందని, కృష్ణ మరణించిన సమయంలో ఈ రెక్కీ జరిగిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఓ పోలీస్ ఆఫీసర్ సాయంతో తన ఫోన్ హ్యాక్ చేసిందంటున్నారు నరేష్.
నరేష్-రమ్య ఎపిసోడ్లో సీనియర్ పొలిటీషియన్ పేరు తెరపైకి వచ్చింది. తన బంధువు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి పేరుతో బెదిరింపులకు దిగింది రమ్య రఘుపతి. 10కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్మెంట్ చేసుకుంటానంటూ మధ్యవర్తితో బేరసారాలు చేసింది రమ్య. ఈ బెదిరింపులకు సంబంధించిన కీలక ఆధారాలన్నీ టీవీ9 సంపాదించింది.
రమ్య ప్రవర్తనపై మరోసారి సంచలన ఆరోపణలు చేశారు నరేష్. పెళ్లైన తర్వాతి నెల నుంచే తనను వేధించడం మొదలుపెట్టిందంటూ సీక్రెట్స్ను బయటపెట్టారు. తిండి పెట్టేది కాదని, కొడుకును కొట్టేదని చెప్పుకొచ్చారు. ఫంక్షన్ ఏదైనా సరే తాగి రచ్చరచ్చ చేసేదన్నారు. రమ్యకి తనపై కంటే డబ్బుపైనే ఎక్కువ ప్రేమ అంటున్నారు నరేష్.
మరిన్ని సినిమా వార్తల కోసంక్లిక్ చేయండి..