‘లూసిఫర్‌’ రీమేక్‌లో ఈ మూడు మార్పులు జరగనున్నాయా..!

మలయాళంలో మంచి విజయం సాధించిన మోహన్‌ లాల్ 'లూసిఫర్'‌ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌కు 'సాహో' ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు.

'లూసిఫర్‌' రీమేక్‌లో ఈ మూడు మార్పులు జరగనున్నాయా..!
Follow us

| Edited By:

Updated on: Apr 25, 2020 | 8:01 AM

మలయాళంలో మంచి విజయం సాధించిన మోహన్‌ లాల్ ‘లూసిఫర్’‌ తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ రీమేక్‌కు ‘సాహో’ ఫేమ్ సుజీత్ దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం సుజీత్.. ఈ మూవీ కథను తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారని ఇటీవల చిరంజీవి వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఈ కథలో ప్రధానంగా మూడు మార్పులను సుజీత్ చేస్తున్నట్లు ఫిలింనగర్ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది.

అందులో ఒకటి హీరోయిన్. ఒరిజనల్ కథలో మోహన్‌ లాల్‌కు హీరోయిన్ ఉండదు, పాటలు ఉండదు. కానీ ఇక్కడ చిరంజీవిని అలా ఊహించుకోవడం ఫ్యాన్స్‌కు కష్టం.  ఈ నేపథ్యంలో ఇందులో హీరోయిన్ పాత్రను పెట్టాలనుకుంటున్నారట సుజీత్. అలాగే పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రభుత్వంపై చాలా సెటైర్లు ఉంటాయి. అయితే ఈ విషయంలో కొన్ని మార్పులు చేయమని చిరు, సుజీత్‌కు సూచించారట. ప్రభుత్వంపై సెటైర్లు వద్దనే ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వాటిపైనా సుజీత్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక మాతృకలో మోహన్‌ లాల్ తమ్ముడి పాత్ర కీలకం కాగా.. ఇక్కడ ఆ పాత్రను మరింత పొడిగించబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే చాలా రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: కరోనా వైరస్: ముక్కులోని ఆ రెండు కీలక కణాలే కారణమట..!