జబర్దస్త్ కమెడియన్లకు సీరియస్ వార్నింగ్.. ‘పిచ్చి కతలు’ పడితే..

దొరబాబు చేసిన పనికి.. మిగిలిన కమెడియన్లందరికీ మల్లెమాల ప్రొడక్షన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి పిచ్చి కథలు పడితే.. జబర్దస్త్ నుంచి తొలగిస్తామని.. హైకమాండ్‌ నుంచి..

జబర్దస్త్ కమెడియన్లకు సీరియస్ వార్నింగ్.. 'పిచ్చి కతలు' పడితే..
Follow us

| Edited By:

Updated on: Mar 05, 2020 | 8:02 PM

‘జబర్దస్త్’ కామెడీ కార్యక్రమం.. ఎంత పాపులర్ షోనో.. అందరికీ తెలిసిన విషయమే. ఈ కార్యక్రమం మొదలై ఇప్పటికి 8 సంవత్సరాలైనా.. దిగ్విజయంగా.. రేటింగ్‌లో ముందుకు దూసుకుపోతుంది. అలాగే.. ఈ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు బుల్లితెరకు పరిచయమయ్యారు. ముఖ్యంగా.. సుడిగాలి సుధీర్, ఆది, శ్రీను, ఆటో రాం ప్రసాద్‌, అప్పారావు, అవినాష్‌ లాంటి పలువురు కమెడియన్లు మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే.. మొదటి నుంచీ ఈ షో ద్వారా పలు కాంట్రవర్సీలకు కేరాఫ్ కూడా అయ్యారు. అప్పట్లో.. చంటి లాంటి వాళ్లపై కొందరు దాడి కూడా చేశారు.

కానీ.. ఇప్పుడు మాత్రం.. జబర్దస్త్ పేరు మరింత మారుమ్రోగుతుంది. ఒక సీనియర్ కమెడియన్ అయి ఉండి.. దొరబాబు ఓ ఇంట్లో వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు. విజయనగరంలో ఓ షో నిర్వహించేందుకు వెళ్లిన దొరబాబు, పరదేశీ.. ఇలా చేయడం ఇప్పుడు పలు చర్చలకు తావిస్తోంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం ఈ సెక్స్ రాకెట్‌తో వీరికి.. గత కొద్ది రోజులుగా సంబంధం ఉందని తెలుస్తోంది.

అయితే ఇప్పుడు దొరబాబు చేసిన పనికి.. మిగిలిన కమెడియన్లందరికీ మల్లెమాల ప్రొడక్షన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలాంటి పిచ్చి కతలు పడితే.. జబర్దస్త్ నుంచి తొలగిస్తామని.. హైకమాండ్‌ నుంచి ప్రత్యేక ఆదేశాలు వచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా.. దొరబాబును జబర్దస్త్ కార్యక్రమం నుంచి తొలగించినట్టు పలు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అసలు అప్పటికే.. ఆది.. దొరబాబు అతనిపై ఇలాంటి జోక్సే వేసి నవ్వులు పుట్టిస్తూంటాడు. అందులోనూ దొరబాబు షోలోకి రాక ముందు ఆయన యూ ట్యూబ్‌లో ‘బిగ్రేడ్ షార్ట్ ఫిల్మ్స్’ కూడా చేశాడు. దాంతో అవే జోకులు ఇప్పుడు నిజమయ్యాయని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.

Read More: పదిమంది కలిసి కొట్టారు.. కంప్లైంట్ ఇచ్చిన రాహుల్!