పాత సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తోన్న తారక్?
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు అన్ని ఇండస్ట్రీస్లోనూ సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పడటం కంటే.. పాత సూపర్ హిట్ కథలనే అటూ ఇటూ కాస్త కథలను మార్చి సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా తన పాత సినిమాలు తెరకెక్కించే పనిలో..
ప్రస్తుతం టాలీవుడ్తో పాటు అన్ని ఇండస్ట్రీస్లోనూ సీక్వెల్స్ హవా నడుస్తోంది. కొత్త కథలతో కుస్తీ పడటం కంటే.. పాత సూపర్ హిట్ కథలనే అటూ ఇటూ కాస్త కథలను మార్చి సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ కూడా తన పాత సినిమాలు తెరకెక్కించే పనిలో పడ్డారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ‘బృందావనం’ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే వంశీ పైడిపల్లి దానికి ఓ సీక్వెల్ స్టోరీని కూడా రెడీ చేశారట. దానికి తారక్ కూడా ఓకే చెప్పారట. కాగా ‘మహర్షి’ సినిమాతో సూపర్ హిట్ని అందుకున్న వంశీ పైడిపల్లి.. మహేష్ బాబుతో మరో సినిమా చేయలనుకున్నారట. అయితే మహేష్ పరుశురామ్తో సినిమా చేస్తున్నారని టాక్. దీంతో వంశీ చిత్రం సెట్స్ ఎక్కాలంటే ఆలస్యం అయ్యే అవకాశముంది. దీంతో ఎన్టీఆర్ కోసం మరో స్టోరీని రెడీ చేసుకున్నారట వంశీ.
ప్రస్తుతం తారక్ కూడా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎక్కువ సమయమే కేటాయించారు. దానికి తోడు లాక్డౌన్తో నెలన్నర సమయం వృథా అయ్యింది. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత వరుస సినిమాలు చేయాలనే ప్లాన్లో ఉన్నారట ఎన్టీఆర్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్, ఆ తర్వాత అట్లీ దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ వంశీతో చేయాలని జూనియర్ ఫిక్స్ అయినట్టు సమాచారం. అలాగే ఎన్టీఆర్కు ఫ్యామిలీస్లోనూ మంచి ఇమేజ్ ఉంది. దీంతో ‘బృందావనం’ సినిమా సీక్వెల్ అంటే అభిమానుల్లోనూ కూడా దీనిపై అంచనాలు పెరిగాయి.
Read More:
వెహికల్ ట్యాక్స్పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం