సుశాంత్ ఇంట్లో రియా పార్టీలు.. షోవిక్ ఎప్పుడూ మత్తులో కనిపించేవాడు
బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు ఇంకా వీడలేదు. అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా చంపారా..?
Sushant Farmhouse manager: బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ అనుమానాస్పద మృతి కేసు ఇంకా వీడలేదు. అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడా..? లేక ఎవరైనా చంపారా..? సుశాంత్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఏంటి..? అన్న ప్రశ్నలు మెదులుతున్నాయి. ఇక ఈ కేసును సీబీఐ, ఈడీ, ఎన్సీబీ దర్యాప్తు చేస్తుండగా.. పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా సుశాంత్ దగ్గర పనిచేసిన కొంతమంది రియాపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సుశాంత్ని రియా ఏటీఎంలా వాడుకునేదని, అతడి జీవితంలోకి రియా ఎంటర్ అయిన తరువాత చాలా మార్పులు చోటుచేసుకున్నాయంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో సుశాంత్ ఫామ్హౌస్ మేనేజర్ మాట్లాడుతూ.. పలు షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
”సుశాంత్ జీవితంలోకి 2019లో రియా చక్రవర్తి ప్రవేశించింది. ఆ ఏడాది ఆమె పుట్టినరోజును సుశాంత్ ఫామ్హౌజ్లో ఘనంగా నిర్వహించారు. ఆ తరువాత నుంచి రియా, ఆమె సోదరుడు షోవిక్ తరచుగా ఇక్కడకు వచ్చేవారు. ఆమె తల్లిదండ్రులు కూడా రెండు, మూడు సార్లు ఇక్కడు వచ్చారు. షోవిక్ ఎప్పుడూ ధూమపానం చేస్తూ మత్తుగా కనిపించేవాడు. అతడి వెంటో అమ్మాయి కూడా వచ్చింది. రియా బర్త్డే పార్టీ తరువాత శృతీ మోదీ కూడా ఫామ్హౌజ్కి వచ్చేది. ఫామ్హౌజ్కి సంబంధించిన ఆర్థిక విషయాలను మొదట్లో సుశాంత్ స్నేహితుడు కుశాల్ జవేరి చూసేకునేవారు. అయితే రియా, షోవిక్, శృతీ మోదీ సుశాంత్ జీవితంలోకి వచ్చాక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. ఓ సారి సుశాంత్ మాజీ అకౌంటెంట్ రజత్ మేవాఠితో మాట్లాడా. సుశాంత్ ఇంట్లో రియా పార్టీలు చేసుకుంటుంటే, అతడు తరచూ మెట్లపైన పడుకునే వాడని రజత్ నాతో చెప్పాడు. అలాగే సుశాంత్ డబ్బులను రియా ఖర్చు చేసేదని, ఆ విషయం తెలిసి సుశాంత్ కోప్పడ్డాడని అతడు నాతో అన్నాడు. అంతేకాదు రియా పరిచయం అయిన తరువాత సుశాంత్ ఎక్కువగా విహార యాత్రకు వెళ్లాడు” అని ఫామ్హౌజ్ మేనేజర్ చెప్పుకొచ్చారు.
Read More: