గంగూలీ సహా పలువురి బయోపిక్‌లో నటించాలనుకున్న సుశాంత్

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌ అనుమానాస్పద మృతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

గంగూలీ సహా పలువురి బయోపిక్‌లో నటించాలనుకున్న సుశాంత్
Follow us

| Edited By:

Updated on: Sep 03, 2020 | 9:38 PM

Sushant Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌‌ అనుమానాస్పద మృతిపై సీబీఐ, ఈడీ దర్యాప్తు కొనసాగుతుండగా.. పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఈడీ ముందు రెండో రోజు హాజరైన సుశాంత్ బిజినెస్ పార్ట్‌నర్‌ వరుణ్ మాతుర్, ఈ హీరోకు సంబంధించిన విషయాలను వారికి వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇదివరకే ధోని బయోపిక్‌లో నటించిన సుశాంత్‌.. టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ బయోపిక్‌లో కూడా నటించాలనుకున్నట్లు సమాచారం. అలాగే ఈ ప్రాజెక్ట్ కోసం గంగూలీని సైతం కలిసిన సుశాంత్‌.. అది తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పలుమార్లు చెప్పారట‌. అయితే కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని వరుణ్, ఈడీకి వెల్లడించినట్లు సమాచారం.

అంతేకాదు స్వామి వివేకానంద, మదర్ థెరిస్సా, రవీంద్రనాథ్ ఠాగూర్‌, మహాత్మాగాంధీ వంటి 12 మంది పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలను వర్చువల్ రియాలిటీలో తెరకెక్కించాలని అనుకున్నారట. వీటన్నింటి గురించి తనతో పలుమార్లు చర్చించినట్లు వరుణ్, ఈడీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. కాగా భారతదేశ మొట్టమొదటి పారాలింపిక్స్‌ గోల్డ్ మెడలిస్ట్ మురళీకాంత్ పట్నేకర్ జీవిత చరిత్రలో కూడా సుశాంత్ నటించాలనుకున్నట్లు పట్నేకర్‌ కుటుంబ సభ్యులు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా జూన్ 14న ముంబయిలోని తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో సుశాంత్ కన్నుమూశారు. సుశాంత్‌ది ఆత్మహత్య అని ముందుగా భావించినప్పటికీ.. ఇప్పటికీ అతడు ఎందుకు చనిపోయాడన్న విషయంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read More:

7 నుంచి హైదరాబాద్ మెట్రో సర్వీసులు.. మార్గదర్శకాలివే

నాలుగు ఆకుల చెట్టు కోసం నాలుగు లక్షలు