రియా వేధిస్తోందని సుశాంత్‌ చెప్పాడు: అంకితా

బాలీవుడ్ నటుడు సుశాంత్‌ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు సహా ఆరుగురిపై సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

రియా వేధిస్తోందని సుశాంత్‌ చెప్పాడు: అంకితా
Follow us

| Edited By:

Updated on: Jul 30, 2020 | 11:39 AM

Ankita Lokhande allegations on Rhea: బాలీవుడ్ నటుడు సుశాంత్‌ ఆత్మహత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సుశాంత్‌ ప్రేయసి, నటి రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు సహా ఆరుగురిపై సుశాంత్‌ తండ్రి కేకే సింగ్‌ పట్నా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమారుడి నుంచి డబ్బులు తీసుకుందని, తన కొడుకు ఆత్మహత్య చేసుకునేలా రియా ప్రేరేపించిందని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ నిమిత్తం నలుగురు సభ్యులతో కూడిన ఓ ప్రత్యేక బృందం ముంబయికి చేరుకుంది.

ఇదిలా ఉంటే ఈ కేసులో బీహార్ పోలీసులు సుశాంత్‌ మాజీ ప్రేయసి అంకితా లోక్వాండేను విచారించారు. ఈ సందర్భంగా రియా తనను వేధించేదని సుశాంత్‌ తనతో చెప్పాడని అంకితా పోలీసులకు చెప్పినట్లు సమాచారం. 2019లో తాను నటించిన మణికర్ణిక సినిమా సమయంలో సుశాంత్‌తో ఒకసారి చాట్ చేయగా.. ఆ సమయంలో రియాతో తన బంధాన్ని తెంచుకోవాలని సుశాంత్‌ తనతో అన్నాడని ఆమె పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే మరోవైపు రియాపై సుశాంత్‌ తండ్రి ఫిర్యాదు తరువాత అంకితా తన ఇన్‌స్టాలో ఓ పోస్ట్‌ పెట్టారు. నిజం గెలుస్తుంది అని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దానికి సుశాంత్‌ సోదరి శ్వేతా సింగ్‌ కిర్తి స్పందిస్తూ.. దేవుడు ఎప్పుడు నిజం వైపే ఉంటాడు అని స్పందించారు.

Read This Story Also: నీలం సాహ్ని పదవీ కాలన్ని పెంచండి.. కేంద్రానికి జగన్ లేఖ