మహేష్-విజయ్ మల్టీస్టారర్ అందుకే ఆగిపోయిందట
టాలీవుడ్ సూపర్స్టార్, కోలీవుడ్ తలపతి విజయ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొనే లెజండరీ దర్శకుడు మణిరత్నం ఈ ఇద్దరితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను తీయాలనుకున్నారు.
టాలీవుడ్ సూపర్స్టార్, కోలీవుడ్ తలపతి విజయ్కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రేజ్ని దృష్టిలో పెట్టుకొనే లెజండరీ దర్శకుడు మణిరత్నం ఈ ఇద్దరితో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాను తీయాలనుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరితో సంప్రదింపులు జరపడం, వారు ఒప్పుకోవడం జరిగిపోయాయి. కానీ సెట్స్ మీదకు వెళ్లకముందే ఆ మూవీ అటకెక్కింది. ఇక ఈ మల్టీస్టారర్ ఆగిపోవడానికి గల కారణాలను తాజాగా మణిరత్నం సతీమణి, నటి సుహాసిని వివరించారు.
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వంను 2016లో ఆయన తెరకెక్కించారు. ఆ సినిమా కోసమే విజయ్, మహేష్లను ఆయన సంప్రదించారు. అంతేకాదు విక్రమ్, కార్తీ, ఆర్య, ప్రభు, కార్తీక్లను ఈ ప్రాజెక్ట్కు ఫైనల్ చేశారు. కాగా అప్పట్లో వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ టెక్నాలజీ అడ్వాన్స్గా లేనందున అప్పట్లో ఈ ప్రాజెక్ట్ వాయిదా పడిందని ఆమె పేర్కొన్నారు. కాగా గతేడాది మరోసారి పొన్నియన్ సెల్వన్ను అనౌన్స్ చేశారు మణిరత్నం. ఇందులో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ తదితరులు నటిస్తోన్న విషయం తెలిసిందే.
Read This Story Also: Breaking: ‘గోకుల్ చాట్’ యజమానికి కరోనా పాజిటివ్.. షాప్ క్లోజ్