ఎస్పీ బాలు హెల్త్ అప్ డేట్
ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ప్రకటించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని చికిత్సకు..
ప్రముఖ సినీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ విషయాన్ని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తాజాగా ప్రకటించారు. తన తండ్రి ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆయన నిదానంగా కోలుకుంటున్నారని చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. ఇలాఉండగా, బాలు ఆరోగ్య పరిస్థితిపై ఆయన అభిమానులు పక్షం రోజులుగా తీవ్ర ఆందోళలో ఉన్న సంగతి తెలిసిందే. బాలు ఆగస్టు 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. తర్వాత ఆయనకు ఎక్మో సాయం అందిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయనకు స్వల్పంగా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారని పూర్తిగా స్పృహలోనే ఉన్నారని ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కూడా చెబుతున్నాయి. అటు, కరోనా బారిన పడిన బాలు భార్య కూడా చికిత్స పొందుతూ నెమ్మదిగా కోలుకుంటున్నారు.
2/9/20 #SPB Health update STABILITY AND SLOW PROGRESS CONTINUES ON THE PATH TO RECOVERY.
— S. P. Charan (@charanproducer) September 2, 2020