హీరోయిన్ భర్త మెడకు ‘మిర్చి’ కేసు.. శిక్ష తప్పదా..!
నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మెడకు మిర్చి కేసు చుట్టుకుంది. గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చి మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనకు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవంబర్ 4న తమ ముందు హాజరుకావాలని వారు కుంద్రాకు నోటీసులు జారీచేశారు. అయితే ముందుస్తుగానే ఈ బుధవారం ఈడీ కార్యాలయానికి కుంద్రా వెళ్లారు. ఈ సందర్భంగా మిర్చితో తనకు గల సంబంధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను వెంట పెట్టుకొని […]
నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా మెడకు మిర్చి కేసు చుట్టుకుంది. గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చి మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనకు ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ)అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నవంబర్ 4న తమ ముందు హాజరుకావాలని వారు కుంద్రాకు నోటీసులు జారీచేశారు. అయితే ముందుస్తుగానే ఈ బుధవారం ఈడీ కార్యాలయానికి కుంద్రా వెళ్లారు. ఈ సందర్భంగా మిర్చితో తనకు గల సంబంధాలకు సంబంధించిన డాక్యుమెంట్లను వెంట పెట్టుకొని వెళ్లారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు ఆయనను దాదాపు 9గంటల పాటు ప్రశ్నించారు. వాటన్నింటికి రాజ్ కుంద్రా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలోనే ఈ కేసులో శిల్పాను కూడా ఈడీ విచారించనుందని సమాచారం.
కాగా అండర్ వరల్డ్ డాన్ దావూద్కు ప్రధాన అనుచరుడిగా చెప్పుకొనే గ్యాంగ్స్టర్ ఇక్బాల్ మిర్చిపై, అతడి కుటుంబంపై ఆర్థిక ఆరోపణల కేసులు ఉన్నాయి. ముఖ్యంగా ముంబయిలో విలువైన ఆస్తుల అమ్మకాలు, కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు భావించిన ఈడీ.. ఈ వ్యవహారంలో మిర్చిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. అయితే 2013లో ఇక్బాల్ చనిపోవడంతో.. ఈ కేసుల్లో అతడి కుడిభుజంగా భావించే రంజీత్ సింగ్ బింద్రాను అక్టోబర్ 11న ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక బింద్రా, కుంద్రా మధ్య జరిగిన కొన్ని వ్యాపార లావాదేవీలపై ఈడీ అధికారులు కీలక సమాచారాన్ని గుర్తించారు. ఇక ఈ వ్యవహారంలో శిల్పాను కూడా త్వరలో ఈడీ ప్రశ్నించనున్నట్లు సమాచారం. అయితే ఈ వ్యాపార వ్యవహారాలలో ఎటువంటి తప్పు చేయలేదని కుంద్రా గతంలో ఖండించిన విషయం తెలిసిందే.