‘బాహుబలి’ని దాటేసిన ‘సరిలేరు’.. టాప్లోకి మహేష్ మూవీ..!
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను రాబట్టడంతో పాటు.. మహేష్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. కాగా ఈ మూవీ ఇప్పుడు టాలీవుడ్లో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఉగాది సందర్భంగా బుల్లితెరపై సరిలేరు మొదటి ప్రీమియర్ ప్రదర్శితం కాగా.. 23.4 టీఆర్పీ రేటింగ్ను సాధించింది. పండుగ రోజు కావడం, లాక్డౌన్ నేపథ్యంలో అందరూ ఇళ్లకు పరిమితం అవ్వడంతో మంచి టీఆర్పీని సాధించింది సరిలేరు. దీంతో బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేయడంతో పాటు.. కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు సూపర్స్టార్. ఇక ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఇది ‘నెవ్వరు బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్’ రికార్డు అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ‘బాహుబలి 2’ మొదటి ప్రీమియర్ సమయంలో 22.70 టీఆర్పీని సాధించగా.. మొన్నటివరకు టాలీవుడ్లో అదే టాప్లో ఉన్న విషయం తెలిసిందే.
ఇక ఈ టీఆర్పీ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదేంటంటే నెక్ట్స్ ప్రీమియర్ సమయంలో ఈ మూవీకి సంబంధించిన మరికొన్ని సీన్లను యాడ్ చేయాలని ఆయన అనుకుంటున్నారట. కాగా ఈ మూవీలో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో కనిపించగా.. రష్మిక ఆయన సరసన నటించింది. విజయశాంతి, ప్రకాష్ రాజ్, సంగీత, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
Read This Story Also: కరోనా ఎఫెక్ట్.. ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆలోచిస్తోన్న దిల్ రాజు