ఎన్టీఆర్ సినిమాలో మరోసారి రమ్యకృష్ణ..!
మామూలుగా సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందులో రమ్యకృష్ణ-ఎన్టీఆర్ కాంబో ఒకటి
Ramya Krishnan NTR: మామూలుగా సినిమా రంగంలో కొన్ని కాంబినేషన్లకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అందులో రమ్యకృష్ణ-ఎన్టీఆర్ కాంబో ఒకటి. ఎన్టీఆర్ నటించిన సింహాద్రిలో ఓ పాటలో మెరిసిన రమ్యకృష్ణ.. ఆ తరువాత నా అల్లుడులో అతడికి అత్తగా నటించింది. ఇందులో వీరిద్దరి సన్నివేశాలకు మంచి మార్కులు పడ్డాయి. అయితే ఆ తరువాత వీరిద్దరు కలిసి నటించలేదు. కానీ ఫిలింనగర్ తాజా సమాచారం ప్రకారం అన్నీ కుదిరితే ఈ ఇద్దరిని మరోసారి తెరపై చూడొచ్చని తెలుస్తోంది.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్లో నటిస్తోన్న ఎన్టీఆర్, ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఇక ఈ మూవీలో ఓ కీలక పాత్రకు గానూ త్రివిక్రమ్, రమ్యకృష్ణను అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆమెతో సంప్రదింపులు జరిపారని, పాత్ర బావుండటంతో రమ్యకృష్ణ ఓకే చెప్పిందని టాక్. ఒకవేళ ఇదే నిజమైతే పవర్ఫుల్ కాంబోలో మరో చిత్రాన్ని చూసే అవకాశం ఉంటుంది. కాగా ఈ చిత్రాన్ని రాధాకృష్ణకుమార్, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
Read More: