‘జనగణమన’పై పూరీ కసరత్తు..?
మహేశ్ బాబుకు రెండు గుర్తుండుపోయే విజయాలను(పోకిరి, బిజినెస్మ్యాన్) ఇచ్చిన డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ అతడితోనే మరో ప్రాజెక్ట్ను కూడా ప్రకటించాడు. అందుకోసం ‘జనగణమన’ అనే టైటిల్ను కూడా రిజిస్టర్ చేయించాడు. సామాజిక సందేశంతో ఈ సినిమా ఉండనున్నట్లు హింట్ కూడా ఇచ్చాడు. అయితే టెంపర్ తరువాత వరుస పరాజయాలతో పూరీ ఢీలా పడటం.. వరుస సినిమాలతో మహేశ్ బిజీగా ఉండటం వలన ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఎలాగైనా […]
మహేశ్ బాబుకు రెండు గుర్తుండుపోయే విజయాలను(పోకిరి, బిజినెస్మ్యాన్) ఇచ్చిన డ్యాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నాథ్ అతడితోనే మరో ప్రాజెక్ట్ను కూడా ప్రకటించాడు. అందుకోసం ‘జనగణమన’ అనే టైటిల్ను కూడా రిజిస్టర్ చేయించాడు. సామాజిక సందేశంతో ఈ సినిమా ఉండనున్నట్లు హింట్ కూడా ఇచ్చాడు.
అయితే టెంపర్ తరువాత వరుస పరాజయాలతో పూరీ ఢీలా పడటం.. వరుస సినిమాలతో మహేశ్ బిజీగా ఉండటం వలన ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని ఎలాగైనా తెరకెక్కించాలని పూరీ అనుకుంటున్నాడట. ప్రస్తుతం రామ్తో పూరీ ఇస్మార్ట్ శంకర్ను తెరకెక్కిస్తుండగా.. ఈ మూవీ పూర్తైన వెంటనే జనగణమనను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనుకుంటున్నాడట. అందుకోసం పూర్తి కథను సిద్ధం చేసి ఎలాగైనా మహేశ్తో ఓకే చెప్పించుకోవాలని అనుకుంటున్నాడట. ఇక ఈ మధ్య పుల్వామా దాడి తరువాత ఓ ట్వీట్నుపెట్టిన పూరీ ఆ డైలాగ్ జనగణమనలోనిది అంటూ వెల్లడించాడు. దీన్ని బట్టి చూస్తుంటే ‘జనగణమన’పై పూరీ గట్టి కసరత్తులే చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్ట్ ఉంటుందో ఉండదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.