OTT Movies: సినీ ప్రియులకు గుడ్న్యూస్.. ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఇకపై ఇంటర్నెట్ అవసరం లేదు.. ఎలాగో తెలుసా..
ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చే మూవీస్... షోలను ఇకపై ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు. ఇందుకు ప్రభుత్వంలో సరికొత్త టెక్నిక్ పై కసరత్తులు చేస్తుంది.
ప్రస్తుతం ఓటీటీల హావా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తీరిగ్గా ఇంట్లోనే చూడొచ్చు. అంతేకాకుండా సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. టాక్ షోలను చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ ఫాంలో వచ్చే మూవీస్… షోలను ఇకపై ఇంటర్నెట్ లేకుండానే చూడవచ్చు. ఇందుకు ప్రభుత్వంలో సరికొత్త టెక్నిక్ పై కసరత్తులు చేస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ రాకంతో వినియోగదారులు యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మల్టీమీడియా కంటెంట్ నేరుగా తమ మొబైల్ ఫోన్లకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ టూ మొబైల్ (D2M) అనే టెక్నాలజీ అనేది… విపత్తు నిర్వహణతో పాటు పౌరులకు నేరుగా ముఖ్యమైన సమాచారాన్ని అందించడానికి, అత్యవసర హెచ్చరికలను జారీ చేయడానికి, నకిలీ వార్తలను తిరస్కరించడానికి ప్రభుత్వానికి సహాయపడుతుంది. దీనిని డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నాలజీ (DoT) అధ్యయనం చేసింది. దీంతో ఆ స్పెక్ట్రమ్ బ్యాండ్ కనుగొన్నారు.
ఈ టెక్నాలజీ వినియోగదారుల స్మార్ట్ఫోన్లకు ప్రసార సేవలను అందించడంలో సహాయపడుతుంది. సెప్టెంబర్లో ఈ D2M సాంకేతికతను పరీక్షించడానికి IIT కాన్పూర్ పబ్లిక్ బ్రాడ్కాస్టర్ ప్రసార భారతితో ఒప్పందం చేసుకుంది.
D2M టెక్నాలజీ అంటే ఏమిటి?..
డైరెక్ట్ టు మొబైల్ (D2M) టెక్నాలజీ ప్రస్తుతం పని చేస్తోంది. ఇది అందుబాటులోకి రావడానికి మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఈ సరికొత్త టెక్నాలజీ FM రేడియో మాదిరిగానే పనిచేస్తుంది. రేడియో ఫ్రీక్వెన్సీలను యాక్సెస్ చేయడానికి రిసీవర్ని ఉపయోగిస్తుంది. ఇది పరికరంలో పొందుపరుస్తారు. ఓటీటీ ప్లాట్ఫారమ్లు మొబైల్ ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ను అందించడానికి ఈ D2M టెక్నాలజీని ఉపయోగించుకోవచ్చు.. ప్రసార భారతి ప్రస్తుతం టీవీ ప్రసారం కోసం 526-582 MHz బ్యాండ్ని ఉపయోగిస్తోంది. ఈ బ్యాండ్ మొబైల్, ప్రసార సేవలు రెండింటికీ పని చేస్తుంది.
ఈ సాంకేతికత వినియోగదారులకు ఎందుకు ముఖ్యమైనది ?..
ఈ టెక్నాలజీ సహాయంతో, స్మార్ట్ఫోన్ వినియోగదారులు తమ మొబైల్ డేటాను ఉపయోగించకుండా ఓటీటీ ప్లాట్ఫారమ్లలో మల్టీమీడియా కంటెంట్ను చూడగలరు. దీంతో మొబైల్ డేటాపై కస్టమర్ల ఖర్చు తగ్గుతుంది. దీనితో పాటు, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా సహాయం పొందుతారు. ఇక్కడ ఇంటర్నెట్ లభ్యత సాధారణంగా సమస్యగా ఉంటుంది. ఇంటర్నెట్ సదుపాయం తక్కువగా ఉన్న లేదా చాలా తక్కువగా ఉన్న ప్రాంతాల్లో, ప్రజలు ఈ కొత్త టెక్నాలజీ సహాయంతో వీడియో కంటెంట్ను చూడగలుగుతారు. అంతేకాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో నివసించే విద్యార్థులు కూడా D2M టెక్నాలజీ సహాయంతో చదువుకోవచ్చు. ఈ టెక్నాలజీని ప్రవేశపెట్టిన తర్వాత, రైతులు ఇంటర్నెట్ లేకుండా వాతావరణ సూచన, వివిధ వ్యవసాయ పద్ధతుల గురించి సమాచారాన్ని పొందగలుగుతారు.