రెండు నెలలుగా.. నాలుగు జతల బట్టలతో.. ‘నాగిని’ బ్యూటీ కష్టాలు..!
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వలన చాలా మంది విదేశాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ కూడా ఒకరు. ఓ మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం మార్చిలో యూఏఈ వెళ్లిన మౌని.. దాదాపు రెండు నెలలుగా అక్కడే ఉంది. ఓ పాత ఫ్రెండ్తో కలిసి ప్రస్తుతం అక్కడ నివసిస్తోంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని తన కుటుంబాన్ని తలచుకుంటూ నిత్యం బాధపడుతోందట. ”ఫొటో షూట్ అయ్యాక ఓ రెండు […]
కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వలన చాలా మంది విదేశాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. అందులో బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ కూడా ఒకరు. ఓ మ్యాగజైన్ ఫొటో షూట్ కోసం మార్చిలో యూఏఈ వెళ్లిన మౌని.. దాదాపు రెండు నెలలుగా అక్కడే ఉంది. ఓ పాత ఫ్రెండ్తో కలిసి ప్రస్తుతం అక్కడ నివసిస్తోంది ఈ బ్యూటీ. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లోని తన కుటుంబాన్ని తలచుకుంటూ నిత్యం బాధపడుతోందట.
”ఫొటో షూట్ అయ్యాక ఓ రెండు వారాల పాటు దుబాయ్లో గడుపుదామనుకున్నా. అందులోనూ ఏప్రిల్ 15 వరకు సినిమాకు సంబంధించిన ఎలాంటి పనులు లేకపోవడంతో ఆ నిర్ణయం తీసుకున్నా. నాకు కొంచెం నిర్లక్ష్యం ఎక్కువ. ప్రపంచం మొత్తం ఇలా మూతపడుతుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా దగ్గర నాలుగు జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు నా కుటుంబం గురించి ఆరా తీస్తున్నా. నా సోదరుడు మా అమ్మ వద్దే ఉన్నాడు. మా బంధువులు కూడా ఇంటి పక్కనే ఉండటం కాస్త సంతోషించదగ్గ విషయం. భారత్కు ఎప్పుడు వస్తానో అని ఎదురుచూస్తున్నా” అని పేర్కొన్నారు.
Read This Story Also: పాకిస్తాన్ విమాన ప్రమాదం..ఆయనొక్కరే బ్రతికారా..!