ఐదు గంటలు వెయిట్ చేసి వెళ్లిపోయిన మహేశ్

తన మూవీ షూటింగ్‌కు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్క కారణంతో దాదాపు ఐదు గంటలు వెయిట్ చేశాడు సూపర్‌స్టార్ మహేశ్. చివరకు చేసేదేమీ లేక వెనుదిరిగి ఇంటికెళ్లిపోయాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది. ప్రస్తుతం మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అందులో భాగంగా ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో షూటింగ్‌ను ప్లాన్ చేశాడు దర్శకుడు. అందుకోసం ఉదయం 7.30గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు మహేశ్. అయితే షూటింగ్‌ చేసేందుకు […]

ఐదు గంటలు వెయిట్ చేసి వెళ్లిపోయిన మహేశ్
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:51 PM

తన మూవీ షూటింగ్‌కు అంతా సిద్ధంగా ఉన్నప్పటికీ ఒక్క కారణంతో దాదాపు ఐదు గంటలు వెయిట్ చేశాడు సూపర్‌స్టార్ మహేశ్. చివరకు చేసేదేమీ లేక వెనుదిరిగి ఇంటికెళ్లిపోయాడు. ఈ సంఘటన ఆదివారం జరిగింది.

ప్రస్తుతం మహేశ్ బాబు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’లో నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. అందులో భాగంగా ఆదివారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో షూటింగ్‌ను ప్లాన్ చేశాడు దర్శకుడు. అందుకోసం ఉదయం 7.30గంటలకు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడు మహేశ్. అయితే షూటింగ్‌ చేసేందుకు కాసేపు ఆగాలని ఎయిర్‌‌‌పోర్టు అధికారులు మహర్షి టీంను కోరారు. దీంతో మహేశ్ కార్వాన్‌లోనే ఉండిపోయాడు.

ఆ తరువాత ఓ బెదిరింపు కాల్ రావడంతో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. దీంతో దాదాపు ఐదు గంటల పాటు వెయిట్ చేసిన మహేశ్ చివరకు ఇంటికి వెళ్లిపోయారట. అయితే ఆ సమయమంతా మహేశ్ చాలా సహనంతో వెయిట్ చేశారని, ఎవరి మీద ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదని తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా.. అల్లరి నరేశ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.