డ్రగ్స్ కేసు: నటి అరెస్ట్.. ఇంట్లో సోదాలు
కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ని సరఫరా చేస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో
Kannada Durgs Case: కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. డ్రగ్స్ని సరఫరా చేస్తోన్న ముఠాను పోలీసులు పట్టుకోవడంతో.. డ్రగ్స్ విషయం వెలుగులోకి రాగా నార్కొటిక్స్ సెంట్రల్ బ్యూరో(ఎన్సీబీ), సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(సీసీబీ) రంగంలోకి దిగింది. దానికి తోడు ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్.. డ్రగ్స్ని వాడే పలువురు సినీ ప్రముఖుల సమాచారాన్ని సీసీబీకి అందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా కన్నడ నటి రాగిణి ద్వివేదిని సీసీబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఉదయం ఆరు గంటలకే రాగిణి నివాసానికి చేరుకున్న సీసీబీ.. బెంగళూరులోని ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ విషయంలో కోర్టు నుండి సెర్చ్ వారెంట్ పొందిన పోలీసులు.. రాగిణి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. కాగా ఈ కేసులో రాగిణికి సీసీబీ బుధవారం నోటీసులు జారీ చేసింది. విచారణకు రావాలని ఆదేశించింది. అయితే తనకు సోమవారం వరకు సమయం కావాలంటూ తన తరఫున న్యాయవాదులను పంపింది. అయితే శుక్రవారం లోపే విచారణకు హాజరుకావాలని మరోసారి ఆదేశాలిచ్చిన పోలీసులు.. ఈ ఉదయం ఆమె ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు ఈ కేసులో రాగిణి ద్వివేది సన్నిహితుడు రవిశంకర్ను సీసీబీ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు ముందు హాజరుపరచగా.. రవి శంకర్ని ఐదు రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. ఇక అతడికి పలువురు సినీ ప్రముఖులతో సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఎప్పుడు, ఎవరి పేరు బయటకు వస్తుందోనేమోనని కన్నడ ప్రముఖులు భయాందోళనకు గురవుతున్నారు.
Read More: