Krithi Shetty: క్రేజీ ఆఫర్ కొట్టేసిన బేబమ్మ.. మరోసారి మెగా కాంపౌడ్లోకి.? అయితే ఈసారి..
Krithi Shetty: వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతిశెట్టి. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, బబ్లీ యాక్టింగ్తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది...
Krithi Shetty: వైష్ణవ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ఉప్పెన చిత్రంతో వెండి తెరకు పరిచయమైంది అందాల తార కృతిశెట్టి. తొలి సినిమాతోనే తన క్యూట్ లుక్స్, బబ్లీ యాక్టింగ్తో ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ చిన్నది అనంతరం వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇప్పటికే నానితో శ్యామ్ సింగరాయ్, నాగచైతన్యతో బంగార్రాజు వంటి బడా చిత్రాల్లో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఇక వీటితో పాటు మరికొన్ని క్రేజీ మూవీస్కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇదిలా ఉంటే తాజాగా కృతి మరో క్రేజీ ఆఫర్ను సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తనకు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చెప్పిన మెగా కాంపౌండ్లో మరోసారి శృతీ కనిపించనున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈసారి మెగా హీరో సరసన కాకుండా, వారి నిర్మాణ రంగంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత ఇటీవల నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఆహా వేదికగా విడుదలైన సేనాపతి చిత్రానికి సుస్మిత నిర్మాతగా వ్యవహరించింది. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రగా తెరకెక్కిన ఈ సినిమా డిజిటల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే సుస్మిత తాజాగా మరో సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమా కోసం కృతిని తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమచారం. ఈ సినిమాకు విరించి వర్మ దర్శకత్వం వహించనున్నాడు. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
Also Read: Smartphone Tips: స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు ఈ 10 తప్పులు చేయకండి.. లేకుంటే పశ్చాత్తాపపడతారు..
Viral Video: ముందు 6 సింహాలు.. వెనుక తోక పట్టుకుని నడుస్తోన్న మహిళ.. చూస్తే బాబోయ్ అంటారు!