Radhe Shyam: ప్రభాస్ రాధేశ్యామ్కి సంబంధించి మరో ఆసక్తికరమైన అప్డేట్.. 15 నిమిషాల క్లైమాక్స్ కోసం ఏకంగా..
Radhe Shyam: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'రాధేశ్యామ్'. ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా యావత్ ఇండియన్ సినీ లవర్స్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో..
Radhe Shyam: ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ సినిమాపై కేవలం తెలుగు ప్రేక్షకుల్లోనే కాకుండా యావత్ ఇండియన్ సినీ లవర్స్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్ ఫ్యాన్స్ వేయి కళ్లతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత అమాంతం పెరిగిన ప్రభాస్ రేంజ్ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను మేకర్స్ ఇంటర్నేషనల్ రేంజ్లో తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్తో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్లుక్, ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలోనే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ‘రాధే శ్యామ్’ టీజర్ను విడుదల చేయనున్నారు. ఇక సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేయనున్నారు.
View this post on Instagram
ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్ భారీగా ఖర్చు చేయనున్నారంట. సుమారు 15 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశం కోసం ఏకంగా రూ. 50 కోట్లు కేటాయించారంట. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగే ఈ సన్నివేశం సినిమాకే హైలెట్గా నిలుస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ రేంజ్లో బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదలకానున్న ఈ సినిమా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Also Read: Ashok Gajapathi Raju: మాన్సాస్ ట్రస్ట్ విషయంలో ప్రభుత్వం రోల్ ఇదే.. తేల్చేసిన అశోక్ గజపతిరాజు
Jammu and Kashmir: కశ్మీర్లో రెచ్చిపోతున్న ఉగ్రమూకలు.. సంచలన కామెంట్స్ చేసిన ఆర్మీ అధికారి..