భారత్‌ ఖాతాలో మరో ఆస్కార్

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న భారత్ ప్రేక్షకుల కల తీరింది. 91వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌లో భారత్ చిత్రం పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌ ఆస్కార్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన గునీత్ మొంగా ఈ చిత్రాన్ని నిర్మించగా రైకా జెడ్‌బాచీ దర్శకత్వం వహించారు. భారతీయ మహిళల బుుతుస్రావ సమస్యలపై ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఆమె తరపున దర్శకురాలు రైకా జెడ్‌బాచీ ఆస్కార్‌ను స్వీకరించారు. ముంబైకు చెందిన గునీత్ మొంగా అద్భుతమైన […]

భారత్‌ ఖాతాలో మరో ఆస్కార్
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:24 PM

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తోన్న భారత్ ప్రేక్షకుల కల తీరింది. 91వ ఆస్కార్ అవార్డుల్లో భారత్‌కు ఆస్కార్ లభించింది. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌లో భారత్ చిత్రం పీరియడ్ ఎండ్ ఆఫ్ సెంటెన్స్‌ ఆస్కార్ గెలుచుకుంది. భారత్‌కు చెందిన గునీత్ మొంగా ఈ చిత్రాన్ని నిర్మించగా రైకా జెడ్‌బాచీ దర్శకత్వం వహించారు. భారతీయ మహిళల బుుతుస్రావ సమస్యలపై ఈ డాక్యుమెంటరీ తెరకెక్కింది. ఆమె తరపున దర్శకురాలు రైకా జెడ్‌బాచీ ఆస్కార్‌ను స్వీకరించారు.

ముంబైకు చెందిన గునీత్ మొంగా అద్భుతమైన సినిమాలు నిర్మించారు. గ్యాంగ్ ఆప్ వసేపూర్ 1, 2 సినిమాలు హిట్ అయ్యాయి. తన సినిమాకు ఆస్కార్‌ దక్కడంపై గునీత్ హర్షం వ్యక్తం చేశారు. ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌ను టచ్ చేసినందుకు తనకు ఆనందంగా ఉందని గునీత్ అన్నారు.