చిరు హిట్ మూవీ సీక్వెల్‌ తీసిన తరువాతే రిటైర్మెంట్ తీసుకుంటా..!

మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సీక్వెల్ తీసిన తరువాతే రిటైర్మెంట్‌ తీసుకుంటానని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు.

చిరు హిట్ మూవీ సీక్వెల్‌ తీసిన తరువాతే రిటైర్మెంట్ తీసుకుంటా..!
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 2:56 PM

మెగాస్టార్ చిరంజీవి హిట్ మూవీ సీక్వెల్ తీసిన తరువాతే రిటైర్మెంట్‌ తీసుకుంటానని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. అందుకోసం తాను ప్రయత్నాలు చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పలు విషయాలు పంచుకున్నారు.

చిరంజీవి, శ్రీదేవి ప్రధానపాత్రల్లో దర్శకధీరుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్‌ కచ్చితంగా తీస్తానని.. ఆ మూవీ తీసిన తరువాతే రిటైర్మెంట్ తీసుకుంటానని అశ్వనీదత్ వెల్లడించారు. 1990లో విడుదలైన జగదేకవీరుడు అతిలోక సుందరి అప్పట్లో ఘన విజయం సాధించగా.. ఆ సినిమా సీక్వెల్ పై తాజాగా ఆయన మాట్లాడారు. ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించబోయే మూవీ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. ఫైనల్ స్క్రిప్ట్‌ చాలా బాగా వచ్చిందని అశ్వనీదత్ కితాబిచ్చారు. కాగా ఈ మూవీ వచ్చే ఏడాది సెట్స్‌ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం. మరి ఇందులో చిరునే నటించబోతున్నారా..? లేక చరణ్ నటిస్తారా..? తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఎప్పటినుంచో ఈ మూవీకి సీక్వెల్ తీయాలంటూ మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తోన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలై రేపటికి(మే 9) 30 సంవత్సరాలు పూర్తి కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించి మూడు దాగి ఉన్న కథలను నాచురల్ స్టార్ నాని తన వాయిస్‌లో వినిపిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఈ మూవీ కథ ఎలా పుట్టుకొచ్చిందో నాని వివరించారు. ఇక తాజాగా ఈ సినిమా పాటల వెనుక కథను నాని తెలిపారు.

Read This Story Also: ఉత్త‌రాంధ్ర‌కు పాకిన కరోనా ! ఏపీలో కొత్తగా 54 కేసులు