‘ప్రభాస్ క్యాండీస్’.. మరోసారి ప్రేమను చాటుకున్న జపాన్వాసులు
బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా ప్రభాస్, రానా, సుబ్బరాజులకు జపాన్లో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు
Candy name after Prabhas: బాహుబలి సినిమాలో నటించిన నటీనటులకు అంతర్జాతీయంగా గుర్తింపు లభించింది. ముఖ్యంగా ప్రభాస్, రానా, సుబ్బరాజులకు జపాన్లో ఫ్యాన్స్ విపరీతంగా పెరిగారు. ఈ క్రమంలో వీరిపట్ల అక్కడి అభిమానులు పలుమార్లు తమ ప్రేమను చాటుకుంటూ వస్తున్నారు. ఇక తాజాగా ప్రభాస్ పేరిట షుగర్లెస్ మింట్ క్యాండీలను తయారు చేసి అక్కడ మార్కెట్లోకి తీసుకొచ్చారు. డార్లింగ్ ప్రభాస్ షుగర్లెస్ పేరుతో ఈ మింటీ క్యాండీలు ప్రస్తుతం జపాన్ మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
కాగా ప్రభాస్ ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్లో నటిస్తుండగా.. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ తరువాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 21వ చిత్రంలో నటించనున్నారు. ఇందులో దీపికా హీరోయిన్గా నటించనుంది. ఈ రెండింటి తరువాత బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో 22వ చిత్రంలో నటించనున్నారు రెబల్ స్టార్. రామాయణం నేపథ్యంలో సాగనున్న ఈ మూవీకి ఆదిపురుష్ అనే టైటిల్ని ఖరారు చేస్తూ ఇటీవల అధికారిక ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే.
Read More:
జగన్ మరో కీలక నిర్ణయం.. తాత్కాలిక పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల పెంపు