నాగార్జున పొలంలో మృతదేహం కలకలం.. పూర్తిగా కుళ్లిపోయి..

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం […]

నాగార్జున పొలంలో మృతదేహం కలకలం.. పూర్తిగా కుళ్లిపోయి..
Follow us

| Edited By:

Updated on: Sep 19, 2019 | 9:13 AM

టాలీవుడ్ హీరో నాగార్జున పొలంలో మృతదేహాం దొరకడం స్థానికంగా కలకలం రేపుతుంది. రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ పరిధిలో ఉన్న నాగార్జున పొలంలో దొరికిన ఆ మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి.. ఎముకల గూడులా ఉంది. కాగా తన పొలంలో సేంద్రియ పంటలు పండించేందుకు ఏర్పాట్లు చేసుకున్న నాగార్జున.. ఈ విషయంపై నిపుణులను అక్కడకు పంపారు. అయితే పొలంలోకి వెళ్లిన తర్వాత ఓ ప్రాంతంలోని గదిలో కుళ్లిపోయిన ఈ మృతదేహాన్ని వారు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని.. అక్కడే పోస్టుమార్టమ్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఆ శవం దొరికిన గదిని సీజ్ చేశారు.

మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దీనిపై దర్యాప్తును ప్రారంభించారు. ఏడాది క్రితం అతడు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే అతడిది హత్యనా..? ఆత్మహత్యనా..? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరోవైపు ఈ విషయంపై ఇంకా నాగార్జున స్పందించలేదు. ఇదిలా ఉంటే గతేడాది జూలైలో ఇదే ఫాంహౌస్‌లో ఎలక్ట్రిక్ షాక్‌కు గురై దంపతులు మృతి చెందిన విషయం తెలిసిందే.