Akshay Kumar: స్టార్ హీరో సినిమా సెట్లో అగ్ని ప్రమాదం.. అక్షయ్ కుమార్, కృతి సనన్ సేఫ్..
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రస్తుతం అక్షయ్ కుమార్.. కృతి సనన్ జంటగా నటిస్తోన్న చిత్రం బచ్ పన్ పాండే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. చివరి షెడ్యూల్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో నిన్న ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్య్కూట్ వలన ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మంటలు అంటుకునే సమయంలో అక్షయ్ కుమార్, కృతి సనన్ కూడా అక్కడే ఉన్నారని సమాచం.
ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సిద్దార్థ, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను దక్షిణాది చిత్రం జిగార్తాండకు రీమేక్ అన్న ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని పెంచాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అక్షయ్ కుమార్ సెల్ఫీ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తుండగా.. అరున భాటియా, యశ్ జోహర్, సుప్రియ మీనన్, కరణ్ జోహార్, పృథ్వీరాజ్ సుకుమారన్, అపూర్వ మెహతా, లిస్టిన్ స్టెఫెన్ నిర్మిస్తున్నారు.
Also Read: Naga Chaitanya: ఆ విషయంలో నాకు సమంతే బెస్ట్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగచైతన్య..
Pushpa Srivalli Dance: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసి టీమిండియా క్రికెటర్లు.. అదరగొట్టేశారుగా.!
Anasuya Bharadwaj: అనసూయ తమిళ్ మూవీ నయా పోస్టర్ చూశారా.. ఆకట్టుకుంటోన్న అందాల భామ..