‘బిగ్బాస్ 4’.. ఆ నలుగురు ఫిక్స్ అయ్యారా..!
తెలుగు బుల్లితెరపై విజయవంతమైన షోల్లో బిగ్బాస్ ఒకటి. ఇప్పటికే ఈ రియాలిటీ షో మూడు సీజన్లను పూర్తి చేసుకోగా.. ఇప్పుడు నాలుగో సీజన్కు నిర్వాహకులు రెడీ అవుతున్నారు.
తెలుగు బుల్లితెరపై విజయవంతమైన షోల్లో బిగ్బాస్ ఒకటి. ఇప్పటికే ఈ రియాలిటీ షో మూడు సీజన్లను పూర్తి చేసుకోగా.. ఇప్పుడు నాలుగో సీజన్కు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. అన్నీ కుదిరితే జూలైలో బిగ్బాస్ 4ను ప్రారంభించాలనుకుంటున్నారు వారు. ఈ క్రమంలో ప్రస్తుతం హోస్ట్, కంటెస్టెంట్లను వారు ఎంపిక చేసుకోవాలనుకుంటున్నట్లు ఫిలింనగర్లో టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పాల్గొనవారు వీరేనంటూ నలుగురి పేర్లు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. వారిలో హీరో తరుణ్, సింగర్ కమ్ యాంకర్ మంగ్లీ, యాంకర్ వర్షిణి సౌందర్రాజన్, సీరియల్ నటుడు అఖిల్ సార్ధక్ ఉన్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
కాగా ఇప్పటివరకు మూడు సీజన్లు జరగ్గా.. ముగ్గురు హీరోలు వ్యాఖ్యతగా వ్యవహరించారు. మొదటి సీజన్కి ఎన్టీఆర్ హోస్ట్గా ఉండగా.. శివబాలాజీ విజేతగా నిలిచారు. రెండో సీజన్కి నాని వ్యాఖ్యతగా వ్యహరించగా.. కౌశల్ టైటిల్ను గెలుచుకున్నారు. ఇక గతేడాది జరిగిన మూడో సీజన్కి నాగార్జున హోస్ట్గా ఉండగా.. రాహుల్ సింప్లిగంజ్ విన్నర్గా గెలిచారు. మరోవైపు హోస్ట్గా మహేష్ బాబు పేరు వినిపించినా.. నాగార్జుననే మరోసారి వ్యాఖ్యతగా వ్యవహరించబోతున్నట్లు టాక్. మరి నాలుగో సీజన్ని ఎవరు హోస్ట్ చేయబోతున్నారు..? ఈ సారి విన్నర్గా ఎవరు నిలవబోతున్నారు..? ముందు సీజన్ కంటే ఇది విభిన్నంగా ఉండనుందా..? లాంటి ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
Read This Story Also: కొత్త పెళ్లికూతురికి కరోనా.. క్వారంటైన్లో 32 మంది..!