Samantha: జోరు మీదున్న సమంత.. మరో తెలుగు సినిమాలో ఛాన్స్.? ఆ హీరోతో ముచ్చటగా మూడో సారి..
Samantha: నాగచైతన్యతో వివాహం తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించిన సమంత.. విడాకుల తర్వాత మళ్లీ వేగాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. 2020లో వచ్చిన 'జాను' చిత్రం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించని సమంత..
Samantha: నాగచైతన్యతో వివాహం తర్వాత సినిమాల్లో వేగాన్ని తగ్గించిన సమంత.. విడాకుల తర్వాత మళ్లీ వేగాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. 2020లో వచ్చిన ‘జాను’ చిత్రం తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించని సమంత ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో బిజీగా మారనుంది. ఇప్పటికే శాకుంతలం, తమిళంలో ఓసినిమాతో పాటు తెలుగులో మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇక కేవలం టాలీవుడ్కే పరిమితం కాకుండా బాలీవుడ్లోనూ సినిమాలు చేయడానికి సమంత పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. సినిమాలకే పరిమితం కాకుండా వెబ్ సిరీస్ల్లోనూ నటించేందుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే సమంత మరో క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా ‘దసరా’ అనే చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల అధికారిక ప్రకటన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తి సురేశ్ కథానాయికగా కనిపించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఇందులో మరో కథానాయికగా సమంతను తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
ఒకవేళ ఈ వార్తే నిజమైతే సమంతకు టాలీవుడ్లో మళ్లీ వరుస ఆఫర్లు క్యూకడతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే సమంత, నానిలు ఇప్పటి వరకు ‘ఏటో వెళ్లిపోయింది మనసు’, ‘ఈగ’ వంటి చిత్రాల్లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ లెక్కన చూస్తే వీరిద్దరి కాంబినేషన్లో రాబోయే మూడో సినిమా ‘దసరా’ కానుందన్నమాట.
Pratip Chaudhuri: ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్టు.. ఎందుకో తెలుసా..?
Pratip Chaudhuri: ఎస్బీఐ మాజీ చైర్మన్ ప్రతీప్ చౌదరి అరెస్టు.. ఎందుకో తెలుసా..?