Priyamani: లాక్‌డౌన్ సమయం దేవుడిచ్చిన వరంలా అనిపించింది.. గత సంవత్సర మధుర స్మృతులను తలుచుకుంటున్న..

Priyamani: గత సంవత్సరం కరోనా వల్ల అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ కొంతమందికి మాత్రం మధుర స్మృతులను మిగిల్చి వెళ్లింది.

Priyamani: లాక్‌డౌన్ సమయం దేవుడిచ్చిన వరంలా అనిపించింది.. గత సంవత్సర మధుర స్మృతులను తలుచుకుంటున్న..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 19, 2021 | 11:24 AM

Priyamani: గత సంవత్సరం కరోనా వల్ల అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కానీ కొంతమందికి మాత్రం మధుర స్మృతులను మిగిల్చి వెళ్లింది. నటి ప్రియమణి కరోనా సంవత్సరం తీపి గుర్తులను అభిమానులతో పంచుకుంటుంది. ఓ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో గత సంవత్సరం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఫ్యామిలీ టైమ్‌ కాస్త దొరికితే బావుండు అని ఆలోచిస్తున్న వాళ్లందరికీ లాక్‌ డౌన్‌ సమయం దేవుడు ఇచ్చిన వరంలా అనిపించిందన్నారు. తనకు ఫ్యామిలీతో చాలా ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరికిందని సంతోషించారు. చాలా సాధారణమైన జీవితం గడిపే వీలు దొరికిందని, కూరగాయలు, వంట సామాన్లు కొనుక్కోవడం, ఇంట్లోనే సినిమాలు చూడటం లాంటివి హ్యాపీగా అనిపించిందన్నారు. కావాల్సినంత సమయం గడిపిన తర్వాత మళ్లీ కెమెరా ముందుకు రావడం హ్యాపీగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రియమణి విక్టరీ వెంకటేశ్‌తో నారప్ప సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Ravi Teja: క్రాక్‌తో ట్రాక్‌లోకి వచ్చిన మాస్ మాహారాజా.. వరుస కడుతున్న పలువురు నిర్మాతలు..