Siddharth: సిద్దార్థ్ చనిపోయాడంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. స్పందించిన హీరో. భావోద్వేగ కామెంట్..
Siddharth: తమిళంతో పాటు తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరో సిద్దార్థ్పై ఇటీవల సోషల్ మీడియాలో ద్వేషపూరితమైన పోస్టులు చేస్తోన్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ చనిపోయాడంటూ..
Siddharth: తమిళంతో పాటు తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరో సిద్దార్థ్పై ఇటీవల సోషల్ మీడియాలో ద్వేషపూరితమైన పోస్టులు చేస్తోన్న విషయం తెలిసిందే. సిద్దార్థ్ చనిపోయాడంటూ.. ‘రిప్ సిద్దార్థ్’ అనే పోస్టులు గతంలో చాలా వచ్చాయి. దీంతో దీనిపై హీరో కూడా అధికారికంగా స్పందించాల్సి వచ్చింది. తనపై కావాలనే ద్వేషాన్ని చిమ్ముతున్నారంటూ హీరో సిద్దార్థ్ పలుసార్లు వాపోయారు. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సిద్దార్థ్పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ నటుడు, ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్బాస్ -13’ విజేత సిద్దార్థ్ శుక్లా గురువారం గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే సిద్దార్థ్ శుక్లాకు బదులుగా హీరో సిద్దార్థ్ ఫొటోను షేర్ చూస్తే.. ‘రిప్ సిద్దార్థ్’ అనే ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఈ ఫొటోను గమనించిన సిద్దార్థ్.. ‘నన్ను కావాలనే ఇలా వేధిస్తున్నారు. ద్వేషిస్తున్నారు’ అంటూ భావోద్వేగంతో కూడిన కామెంట్ చేశారు సిద్దు.
సిద్దార్థ్ ట్వీట్..
Targetted hate and harassment. What have we been reduced to? pic.twitter.com/61rgN88khF
— Siddharth (@Actor_Siddharth) September 2, 2021
మరి ఈ వ్యవహారం ఎప్పటితో ఆగుతుందో చూడాలి. ఇక సిద్దు సినిమాల విషయానికొస్తే.. ఈయన చాలా రోజుల తర్వాత తెలుగులో మరోసారి ‘మహాసముద్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమాకు ఆర్ఎక్స్100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా, ఇందులో శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు.
Rashi Khanna: తెల్ల పూలతో, కవ్వించే చూపులతో మనసు దోచుకుంటున్న బొద్దు ముద్దుగుమ్మ రాశి ఖన్నా..