వన్డే సిరీస్ను వెంటాడుతున్న కోవిడ్-19.. ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య అన్ని మ్యాచులు రద్దు.. ఇదే కారణం
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్పై కోవిడ్-19 ప్రభావం పడింది. దీంతో వన్డే సిరీస్ను రద్దు చేశారు. జట్టు సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా..
ఇంగ్లాండ్-దక్షిణాఫ్రికా మధ్య జరగాల్సిన వన్డే సిరీస్పై కోవిడ్-19 ప్రభావం పడింది. దీంతో వన్డే సిరీస్ను రద్దు చేశారు. జట్టు సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలిన నేపథ్యంలో ఇరుదేశాల బోర్డులు ఈ నిర్ణయం తీసుకున్నాయి.
షెడ్యూల్ ప్రకారం డిసెంబరు 4 తొలి వన్డే జరగాల్సి ఉండింది. కానీ అదే రోజు ఉదయం ఓ దక్షిణాఫ్రికా ఆటగాడికి పాజిటివ్గా తేలింది. దీంతో తొలి వన్డేను డిసెంబరు 6 వాయిదా వేశారు. అప్పుడు ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉంటున్న హోటల్ సిబ్బందిలో ఇద్దరికి కరోనా సోకినట్లుగా సమాచారం.
దీంతో అనంతరం ఇంగ్లాండ్ బృందంలోని ఇద్దరు సభ్యులకు పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఫలితంగా వన్డే సిరీస్ను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వీలు చూసుకుని ఈ సిరీస్ను తిరిగి నిర్వహిస్తామని వెల్లడించారు. అంతకుముందు జరిగిన టీ20 సిరీస్ను 3-0 తేడాతో ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది.