ఈ ‘తమాషా’కు స్వస్తి చెప్పండి, ప్రధాని మోదీపై అశోక్ గెహ్లాట్ ఫైర్
తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. మీరు ఈ దేశానికి రెండుసార్లు ప్రధాని అయిన వ్యక్తి అని, మీరు ప్రజలను చప్పట్లు కొట్టేలా..
తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించిన రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. మీరు ఈ దేశానికి రెండుసార్లు ప్రధాని అయిన వ్యక్తి అని, మీరు ప్రజలను చప్పట్లు కొట్టేలా, పాత్రలు చరిచేలా చేశారని, మిమల్ని వారు (ప్రజలు) విశ్వసించారని..తీవ్ర స్వరంతో అన్నారు. రాజస్తాన్ లో జరుగుతున్న ఈ ‘తమాషా’ కు స్వస్తి చెప్పాలని, అసెంబ్లీ సెషన్ కి ముందు మీ బీజేపీ నేతలు బేరసారాలను పెంచారని గెహ్లాట్ ఆరోపించారు. ఏమిటీ డ్రామా అని ఆయన ప్రశ్నించారు. జైసల్మీర్ లో మీడియాతో మాట్లాడిన గెహ్లాట్.. మా ఎమ్మెల్యేలను భద్రంగా కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామన్నారు. సచిన్ పైలట్ ని పార్టీ హైకమాండ్ క్షమించిన పక్షంలో.. ఆయనను, ఆయన వర్గ రెబెల్ ఎమ్మెల్యేలను తిరిగి తమ శిబిరంలో చేర్చుకోవడానికి సిధ్దమే అని ఆయన ప్రకటించారు.
WATCH: …Prime Minister should stop the ‘tamasha’ going on in Rajasthan. The rate for horse-trading has increased here. What ‘tamasha’ is this?: Rajasthan Chief Minister Ashok Gehlot in Jaisalmer pic.twitter.com/W9s9THllBJ
— ANI (@ANI) August 1, 2020