PSL Copies IPL: ఇదేం పని..ఐపీఎల్ ప్రోమో కాపీ కొట్టిన పాకిస్థాన్ సూపర్ లీగ్!
పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐదో ఎడిషన్కు రంగం సిద్దమైంది. ట్రోఫీని నిన్న(గురువారం) గ్రాండ్గా లాంచ్ చేశారు. అయితే పాకిస్థాన్ మరోసారి సోషల్ మీడియా ముందు బొక్కబోర్లా పడింది. ప్రమోషనల్ ఈవెంట్ యాజ్టీజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రోమోని పోలి ఉండటంతో..వివాదం రాజుకుంది.
PSL Copies IPL: పాకిస్థాన్ సూపర్ లీగ్ ఐదో ఎడిషన్కు రంగం సిద్దమైంది. ట్రోఫీని నిన్న(గురువారం) గ్రాండ్గా లాంచ్ చేశారు. అయితే పాకిస్థాన్ మరోసారి సోషల్ మీడియా ముందు బొక్కబోర్లా పడింది. ప్రమోషనల్ ఈవెంట్ ప్రోమో.. యాజ్టీజ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రోమోని పోలి ఉండటంతో..వివాదం రాజుకుంది. ఐపీఎల్ ప్రోమోను కాపీ కొట్టిన టైటిల్ స్పాన్సర్ హబీబ్ బ్యాంక్..సేమ్ అలానే పీఎస్ఎల్ ప్రోమోను తయారు చేసింది. దీంతో నెటిజన్లు ఫిర్యాదు చేయడంతో..పాక్ క్రికెట్ లీగ్ అధికారులు డిఫెన్స్లో పడ్డారు. వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీనిపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. 2016 లో లీగ్ ప్రారంభించినప్పటి నుండి పీఎస్ఎల్ టైటిల్ స్పాన్సర్గా ఉన్న హబీబ్ బ్యాంక్ మార్కెటింగ్ హెడ్ ఈ విషయంపై తాము విచారణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వెంటనే సదరు ప్రోమోను నిలిపివేశారు. ఐపీఎల్ కోసం ఎయిర్టెల్ డిజైన్ చేసిన ఓ ప్రకటనలాగే తమ వీడియో ఉన్నట్లు పీఎస్ఎల్ నిర్వాహకులు కూడా ధృవీకరించారు.
కాగా మొదటిసారి టోర్నీలోని మ్యాచులన్నింటిని పాకిస్థాన్లోనే నిర్వహిస్తున్నారు. లాహోర్, ముల్తాన్, రావల్పిండి, కరాచీ నగరాలు మ్యాచులకు వేదిక కానున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 22 వరకు పీఎస్ఎల్ లీగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి : ‘భీష్మ’ ట్విట్టర్ రివ్యూ : నితిన్ మళ్లీ హిట్ ట్రాక్లోకి వచ్చాడు..!