మృత్యువాతపడ్డ మరో గజరాజు..!
ఛతీస్గఢ్లో మరో ఏనుగు మృత్యువాత పడింది. దీంతో గజరాజుల మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఒకే జిల్లాలో వరుసగా ఏనుగులు మృతి చెందుతుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఛతీస్గఢ్లో మరో ఏనుగు మృత్యువాత పడింది. దీంతో గజరాజుల మృతుల సంఖ్య మూడుకు చేరింది. ఒకే జిల్లాలో వరుసగా ఏనుగులు మృతి చెందుతుండడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాయ్ఘడ్ జిల్లా ధరమ్జాయ్గర్ బెహ్రామర్ గ్రామంలో గురువారం మరో ఏనుగు అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఏనుగు మృతికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. రెండురోజుల క్రితం ఇదే జిల్లాలో విద్యుదాఘాతంతో మరో ఏనుగు మృతి చెందింది. గతవారం సూరజ్పూర్ జిల్లాలోని ప్రతాప్పూర్ ప్రాంతంలో గర్భంతో ఉన్న ఏనుగుతో సహా మరొకటి మృత్యువాత పడ్డాయి. వరుసగా ఏనుగల మృతి పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత నెలలో కేరళలో గర్భంతో ఉన్న ఏనుగును హతమార్చిన ఘటన తర్వాత వరుసగా గజరాజులు చనిపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జంతు ప్రేమికులు.