ఆఫర్ ముగియనుంది.. త్వరగా ట్యాంక్ ఫుల్ చేయించుకోండి.. రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు
పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను(petrol prices) కేంద్ర ప్రభుత్వం..
పెట్రోల్ రేట్ల పెరుగుదలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో పెట్రోల్ ధరలను(petrol prices) కేంద్ర ప్రభుత్వం పెంచనుందని అన్నారు. త్వరలోనే ‘ఎన్నికల ఆఫర్’ ముగుస్తుందని ఎద్దేవా చేశారు. ప్రజలు తమ వాహనాల పెట్రోల్ ట్యాంక్లను నింపుకోవాలని సూచించారు. ఈ మేరకు ట్విట్టర్వేదికగా తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో పెట్రో ధరల పెంపును నిలిపివేసి, పోలింగ్ ముగియగానే బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతోందని మండిపడ్డారు. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఉత్తరప్రదేశ్సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ( Assembly Elections)ఎన్నికలు మార్చి 7తో ముగుస్తాయి. మార్చి10న ఓట్ల లెక్కింపు జరగనుంది.
फटाफट Petrol टैंक फुल करवा लीजिए।
मोदी सरकार का ‘चुनावी’ offer ख़त्म होने जा रहा है। pic.twitter.com/Y8oiFvCJTU
— Rahul Gandhi (@RahulGandhi) March 5, 2022
మరోవైపు ఉక్రెయిన్ – రష్యా (Ukraine-Russia) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా పెట్రో ధరలు భారీగా మండిపోనున్నాయి. గతేడాది నవంబర్ నుంచి దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీనిపై యుద్ధం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు 110 అమెరికన్ డాలర్లు దాటాయి. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ.. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు.
Also Read
Chiranjeevi: ఊరమాస్ కమర్షియల్ ఎంటర్టైనర్లకే ఓటేస్తున్న మెగాస్టార్.. ఫ్యాన్స్ కు పూనకాలే..
Manipur Elections: మణిపూర్లో ముగిసిన తుది విడత పోలింగ్.. పలుచోట్ల హింసాత్మక ఘటనలు!