మోదీకి దీటైన నాథుడే లేడు.!
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ తుది దశ పోలింగ్ జరుగుతోంది. ఇక ఈ దశలో అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంపైనే ఉంది. వారణాసినే లోక్సభ స్థానంగా ఎంచుకున్న ప్రధాని మోదీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ స్థానం నుంచి మోదీతో పాటు మరో 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మోదీకి ప్రధాన పోటీగా కాంగ్రెస్కు చెందిన అజయ్ రాయ్, ఎస్పి, బిఎస్పి కూటమి అభ్యర్థి శాలినీ యాదవ్ ఉన్నారు. మరోవైపు మోదీకి […]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాళ తుది దశ పోలింగ్ జరుగుతోంది. ఇక ఈ దశలో అందరి దృష్టి ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గంపైనే ఉంది. వారణాసినే లోక్సభ స్థానంగా ఎంచుకున్న ప్రధాని మోదీకి గట్టి పోటీ ఎదురుకానుంది. ఈ స్థానం నుంచి మోదీతో పాటు మరో 25 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ మోదీకి ప్రధాన పోటీగా కాంగ్రెస్కు చెందిన అజయ్ రాయ్, ఎస్పి, బిఎస్పి కూటమి అభ్యర్థి శాలినీ యాదవ్ ఉన్నారు.
మరోవైపు మోదీకి వ్యతిరేకంగా తెలుగు రాష్ట్రాల రైతులు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అందులో పలువురు నామినేషన్లు తిరస్కరణకు గురవడంతో.. తుది జాబితాలో ఇద్దరి రైతుల పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో 24వ అభ్యర్థిగా విశాఖపట్నంకు చెందిన మానవ్, 25వ అభ్యర్థిగా తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాకు చెందిన రైతు సున్నం ఇస్తారి ఉన్నారు.
ఇది ఇలా ఉండగా మోదీ పాలన, ఆయన చరిష్మా, గత ఐదేళ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులపై కమలం పార్టీ ధీమాగా ఉంది. ఈసారి కూడా గెలుపు మోదీదే అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.