బాబుకు ఊరట..కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదముద్ర వేసింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐతే మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతిపై సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కానీ చివరి నిమిషంలో […]
ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కేబినెట్ భేటీ అజెండాలోని అంశాలకు ఈసీ ఆమోదముద్ర వేసింది. ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు చంద్రబాబు. కరువు, ఫొని తుఫాన్, తాగునీటి సమస్యలపై అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ఐతే మంత్రివర్గ సమావేశానికి ఈసీ అనుమతిపై సాయంత్రం వరకు తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. కానీ చివరి నిమిషంలో కేబినెట్ భేటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈసీ. ఏపీ కేబినెట్ సమావేశం వాస్తవానికి ఈనెల 10నే జరగాల్సి ఉంది. కానీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం అడ్డుచెప్పారు. భేటీకి సంబంధించిన ఎజెండాను 48 గంటల ముందు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపి అనుమతి తీసుకున్న తర్వాతే మంత్రివర్గం సమావేశం నిర్వహించాలని స్పష్టంచేశారు. ఈ క్రమంలోనే ఏపీ కేబినెట్ భేటీ మే14కు వాయిదా పడింది.