‘ మా మిసైల్ దాడుల్లో 80 మంది అమెరికన్ టెర్రరిస్టుల మృతి’.. ఇరాన్

ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరాలపై తాము 15 మిసైళ్ళతో జరిపిన దాడుల్లో కనీసం 80 మంది ‘ అమెరికన్ టెర్రరిస్టులు ‘ మరణించారని ఇరాన్ ప్రకటించింది. మా క్షిపణులన్నీ నిరాఘాటంగా టార్గెట్లను తాకాయని సీనియర్ రెవల్యూషనరీ గార్డ్స్ ను ఉటంకిస్తూ.. ఇరాన్ టీవీ పేర్కొంది. అమెరికా ఒకవేళ ప్రతీకార చర్యకు దిగిన పక్షంలో మేం మరో 100 టార్గెట్లను లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆ గార్డ్స్ తెలిపారని టీవీ వెల్లడించింది. తమ మిసైల్ ఎటాక్స్ లో […]

' మా మిసైల్ దాడుల్లో 80 మంది అమెరికన్ టెర్రరిస్టుల మృతి'.. ఇరాన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 08, 2020 | 4:27 PM

ఇరాక్ లోని అమెరికన్ సైనిక స్థావరాలపై తాము 15 మిసైళ్ళతో జరిపిన దాడుల్లో కనీసం 80 మంది ‘ అమెరికన్ టెర్రరిస్టులు ‘ మరణించారని ఇరాన్ ప్రకటించింది. మా క్షిపణులన్నీ నిరాఘాటంగా టార్గెట్లను తాకాయని సీనియర్ రెవల్యూషనరీ గార్డ్స్ ను ఉటంకిస్తూ.. ఇరాన్ టీవీ పేర్కొంది. అమెరికా ఒకవేళ ప్రతీకార చర్యకు దిగిన పక్షంలో మేం మరో 100 టార్గెట్లను లక్ష్యంగా పెట్టుకున్నాం అని ఆ గార్డ్స్ తెలిపారని టీవీ వెల్లడించింది. తమ మిసైల్ ఎటాక్స్ లో అమెరికన్ హెలికాఫ్టర్లు, సైనిక సాధనాలు, పరికరాలు ధ్వంసమయ్యాయని వారు చెప్పుకున్నారు. అయితే ఈ సమాచారం ఎక్కడినుంచి వచ్చిందన్నదాన్ని   మాత్రం వెల్లడించలేదు. అటు-అమెరికాతో తాము యుధ్ధాన్ని కోరుకోవడంలేదని, గత శుక్రవారం తమ సైనిక జనరల్ ఖాసిం సులేమాన్ యుఎస్ డ్రోన్ దాడుల్లో మృతి చెందినందుకు ప్రతీకారంగానే చేసిన దాడులు ముగిశాయని ఇరాన్ అధికారులు స్పష్టం చేశారు. కెర్మాన్ నగరంలో సులేమాన్ అంత్యక్రియలు ముగుస్తుండగా.. దాదాపు అదే సమయంలో ఈ మిసైల్ దాడులు జరిగాయని వారు గుర్తు చేశారు. కాగా-ఈ క్షిపణి దాడులు జరుగుతుండగా ఇరానియన్లు సెలబ్రేట్ చేసుకుంటున్న దృశ్యాలను ఇరాన్ టీవీ ప్రసారం చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టర్ 51 వ అధికరణం కింద ఆత్మరక్షణార్థం తాము తీసుకున్న చర్యలు ముగిశాయని ఇరాన్ విదేశాంగ మంత్రి మహ్మద్ జావేద్ జరీఫ్ కూడా తెలిపారు. తాము యుధ్ధాన్ని కోరుకోవడంలేదని, అయితే ఎలాంటి ‘ ఆక్రమణనైనా ఎదుర్కొనేందుకు సంసిధ్ధంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు