హాంకాంగ్.వెళ్తున్న నౌకనుంచి 18 మంది భారతీయుల కిడ్నాప్

హాంకాంగ్ వెళ్తున్న నౌకలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయులను నైజీరియా సముద్ర తీర ప్రాంతంలో సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలిసినవెంటనే నైజీరియాలోని భారత దౌత్యాధికారులు అక్కడి అధికారులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేయాలని, కిడ్నాపైన భారతీయులను రక్షించాలని వారు కోరారు. నౌకల ట్రాకింగ్ ని పర్యవేక్షించే ఎఆర్ఎక్స్ మారిటైం తన వెబ్ సైట్ లో.. ఈ నెల 3 వ తేదీ సాయంత్రం ఈ నౌకను సముద్రపు దొంగలు దారి […]

హాంకాంగ్.వెళ్తున్న నౌకనుంచి 18 మంది భారతీయుల కిడ్నాప్
Follow us

|

Updated on: Dec 05, 2019 | 11:20 AM

హాంకాంగ్ వెళ్తున్న నౌకలో ప్రయాణిస్తున్న 18 మంది భారతీయులను నైజీరియా సముద్ర తీర ప్రాంతంలో సముద్రపు దొంగలు కిడ్నాప్ చేశారు. ఈ సమాచారం తెలిసినవెంటనే నైజీరియాలోని భారత దౌత్యాధికారులు అక్కడి అధికారులను సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలు తెలియజేయాలని, కిడ్నాపైన భారతీయులను రక్షించాలని వారు కోరారు. నౌకల ట్రాకింగ్ ని పర్యవేక్షించే ఎఆర్ఎక్స్ మారిటైం తన వెబ్ సైట్ లో.. ఈ నెల 3 వ తేదీ సాయంత్రం ఈ నౌకను సముద్రపు దొంగలు దారి మళ్లించారని, ఇందులో 19 మంది ఉండగా 18 మంది భారతీయులని పేర్కొంది. ఉన్న ఒక వ్యక్తీ టర్కీకి చెందిన వాడని తెలిసింది. వీ ఎల్ ఎల్ సీ సీ.. కాన్స్టిలేషన్ అనే ఈ నౌకపై పైరేట్స్ దాడి చేసినప్పటికీ దానికి ఎలాంటి నష్టం జరగలేదని, ఈ షిప్ నైజీరియన్ నేవీ అజమాయిషీలో ఉందని వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అసలే నిరసనలతో అట్టుడుకుతున్న హాంకాంగ్ కు ఈ భారతీయులు ఎందుకు వెళ్తున్నారన్నది మిస్టరీగా మారింది. చైనా ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా హాంకాంగ్ లో దాదాపు ఆరు నెలలుగా అల్లర్లు జరుగుతున్నాయి.