సముద్రపు దొంగలు మంచోళ్ళే ! ఆ 18 మంది భారతీయుల విడుదల
హాంకాంగ్ కు వెళ్తున్న 18 మంది భారతీయులను నైజీరియా కోస్తా తీరప్రాంతంలో నౌక నుంచి కిడ్నాప్ చేసిన సముద్రపు దొంగలు వారిని విడుదల చేశారు. ఈ నెల 3 న హాంకాంగ్ సమీపంలోని బోనీ దీవి వద్ద వారిని సముద్రపు దొంగల ముఠా కిడ్నాప్ చేసి.. బందీలుగా తీసుకుపోయింది. వీరిని ఆదివారం రిలీజ్ చేశారని నైజీరియన్ నేవీ, షిప్పింగ్ కంపెనీలు ధృవీకరించాయి. ఈ భారతీయుల బృందం వెంటనే విడుదలయ్యేలా చూడాలంటూ నైజీరియాలోని భారత దౌత్యకార్యాలయాన్ని, ఆ దేశ […]
హాంకాంగ్ కు వెళ్తున్న 18 మంది భారతీయులను నైజీరియా కోస్తా తీరప్రాంతంలో నౌక నుంచి కిడ్నాప్ చేసిన సముద్రపు దొంగలు వారిని విడుదల చేశారు. ఈ నెల 3 న హాంకాంగ్ సమీపంలోని బోనీ దీవి వద్ద వారిని సముద్రపు దొంగల ముఠా కిడ్నాప్ చేసి.. బందీలుగా తీసుకుపోయింది. వీరిని ఆదివారం రిలీజ్ చేశారని నైజీరియన్ నేవీ, షిప్పింగ్ కంపెనీలు ధృవీకరించాయి. ఈ భారతీయుల బృందం వెంటనే విడుదలయ్యేలా చూడాలంటూ నైజీరియాలోని భారత దౌత్యకార్యాలయాన్ని, ఆ దేశ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. వీరి విడుదలకు సముద్రపు దొంగలు ఎలాంటి షరతులూ విధించలేదని తెలుస్తోంది. మొత్తానికి వీరంతా క్షేమంగా రిలీజ్ కావడంతో సర్కార్ ఊపిరి పీల్చుకుంది. హాంకాంగ్ లో చైనా ఆధిపత్యానికి నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్న వేళ.. వీరి కిడ్నాప్ ఉదంతం ఇండియాలో సంచలనమైంది. అసలు వీరిని పైరేట్స్ ఎందుకు కిడ్నాప్ చేశారన్నది మిస్టరీగా మారింది కూడా.. ఈ భారతీయులంతా తిరిగి ఇండియాకు చేరుకున్న అనంతరమే ఏం జరిగిందన్నది తెలియనుంది. ఇన్నాళ్లూ ఈ భారతీయులను వారు ఎక్కడ ఉంచారు.. ఎలా ట్రీట్ చేశారో తెలియడంలేదని భారత ప్రభుత్వం అంటోంది.